–సీఎం స్వయంగా ఎమ్మెల్యేల ఇం టికి వెళ్లి కండువా కప్పుతున్నాడు
–ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీ డియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో గడిచిన తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్రలా రేవం త్ ప్రభుత్వం నడుస్తోందని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ద్వజమెత్తారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి,రెండు లక్షల ఉద్యోగాలు (employees)అని చెప్పి అన్ని వర్గాలను సీఎం రేవంత్ రెడ్డి(revanth Reddy)మోసం చేశారని ఆరోపించా రు. ముఖ్యమంత్రి స్వయంగా ఎ మ్మెల్యేల ఇంటికి చేరి కాళ్లు పట్టు కొని మరి కండువాలు కప్పుతాడని విమర్శించారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (koushik Reddy)ఇంటి వద్ద కేటిఆర్ మీడియాతో మాట్లాడారు. పది మంది ఎమ్మె ల్యేలు పోయారని ఇంకా వస్తారని కాంగ్రెస్ మంత్రులు(Congress metting)నుండి ఎ మ్మె ల్యేల వరకు మాట్లాడుతారని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ లో భయం మొదలైందని,
ఫిరాయింపులపై స్పీకర్ ని కలిసి సుప్రీంకోర్టు (supreme court)తీర్పలను సైతం ఉటం కిస్తూ పిర్యాదు చేశామని చెప్పారు.
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) September 14, 2024
దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసిందే కౌశిక్ రెడ్డి అని తెలిపారు. బీఆర్ఎస్ (brs)పార్టీ తర పున హైకోర్టు జస్టిస్ కి కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపడి చావు డప్పు లు కొట్టండి అని మాట్లాడి0దే రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు.
హైకోర్టు తీర్పు వచ్చిన రోజు అరి కెపుడి గాంధీని పిఎసి చైర్మన్ గా నియమిస్తూ ప్రకటన చేశారని,
ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతూ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తే పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి దిగారని దుయ్యబట్టారు. ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడు లేదని, ఫ్యాక్షన్ సినిమా లు తలపించేలా వచ్చారని, చేత గాని ముఖ్యమంత్రి వల్లనే ఇదంతా జరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రేపు జరగరానిది జరిగితే ఎవరు భాద్యత వహి స్తారని, ము ఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో తెలి యదని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైన చెప్పాలి ఏ పార్టీలో ఉన్నారో అని ప్రశ్నించారు.
గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారని, నీలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులను చూ శామని, పైశాచిక ఆనందం కోసమే ఇదంతా రేవంత్(revanth )చేస్తున్నాడని ఆరోపించారు. ఇవన్నీ తిరిగి రేవంత్ కి తిరిగి చుట్టుకుంటాయని జోస్యం చెప్పారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను(police )సస్పెండ్ చేయాలని డిజిపి ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అర్థ రాత్రి వరకు తిప్పితే తెలంగాణ ప్రజలు మొత్తం మా వెంట నిలిచా రని, ముఖ్యమంత్రి సొంత జిల్లా లోనే తెలంగాణ ప్రజల పౌరుషం చాటారని వెల్లడించారు. నిన్న మ ముల్ని హౌజ్ అరెస్ట్ చేసి గాంధీని రక్షణ కల్పించారని, గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు కాదన్నారు. హైద రాబాద్ లో పదేళ్లలో శాంతి భద్ర తలు అద్భుతంగా మెయింటైన్ చేసామని, హైదరాబాద్ లో ఉన్న ప్రజలు అందరు మా వారేనని, ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు ఇప్పుడు ఉండవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలి చారని రేవంత్ కక్ష సాధింపు చర్య లు చేపడుతున్నారని విమర్శిం చారు. కాంగ్రెస్ లో ఎందుకు చేరి నవ్ దిక్కుమాలిన పిఎసి పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లా డిన గాంధీకి సిగ్గుండాలని హితవు పలికారు. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏపార్టీలో ఉన్నాడో చెబుతారని హెచ్చ రిం చారు.