—7 వేల కోట్ల రైతుబంధు నిధులు మళ్లించారు
–బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: రైతు రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను (Telangana farmers)మోసం చే స్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొ న్నారు. గురువారం ట్విట్టర్ లో స్పందించిన ఆయన రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7వేల కోట్లు రుణమాఫీకి (Loan waiver)దారిమళ్లించారని ఆరో పించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులుకొ డుతు న్నారని విమర్శించారు. ’40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తరు?’ అని ప్రశ్నించారు.
2014, 2018లో కేసీఆర్ సర్కార్ (KCR Sarkar)రుణమా ఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత కల్పించారని పేర్కొన్నారు. 2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్షలో పు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందన్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలుగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని, అర్హులైన రైతలందరికీ రైతుబంధు సాయం విడుదల చేయాలని డిమాండ్ (demand)చేశారు.