–ఆర్థిక మంత్రి ప్రసంగం యావత్తు తెలంగాణ వేరే పలకలే
–మాజీ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR:ప్రజాదీవెన, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు మరోసారి కేంద్రం (central)అన్యాయం చేసింది.. ఆర్థిక మంత్రి కనీసం తెలంగాణ పేరును కూడా పలకలేదు.. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకీ నిర్లక్ష్యం?.. పునర్విభజన చట్టం అంటే ఏపీ (ap) ఒక్కటే కాదు.. ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలి.. ఏపీకి నిధులిస్తే మాకేం బాధలేదు.. అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ కేటీఆర్ (ktr) పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ (Central Budget)పై స్పందించిన కేటీఆర్ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేలుకోవాలని సూచించారు. కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినందుకు.. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అంటూ ఎద్దెవా చేశారు. లోక్సభలో (lok shaba) గులాబీకండువా ఉండి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే.. యాచించి కాదు, శాసించి డిమాండ్లు సాధించుకోగలమన్నారు. 16మంది ఎంపీలతో చంద్రబాబు
కేంద్రాన్ని శాసిస్తున్నారు.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. తెలంగాణ 16మంది ఎంపీలు నోరు మెదపలేదు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించామని.. దక్కింది శూన్యమని కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారన్నారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని పేర్కొన్నారు. ములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదన్నారు. ఐఐఎం సహా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను (Central National Institutions)ఇవ్వమని తాము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు.