–తుంగతుర్తి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం
–జర్నలిస్టులను సైతం వదలడం లేదు
–డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన కెటిఆర్ బృందం
KTR team: ప్రజా దీవెన, హైదరాబాద్: తమ సహనాన్ని పరీక్షిస్తే చర్యకు ప్రతిచర్య తప్పదని భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హె చ్చరించారు. రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) కి సవాల్ విసిరితే స్పందించలేద న్నారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కేటీఆర్ తో పాటు పలువురు భారాస నాయ కులు డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిం దని డీజీపీకి చెప్పారు. అనంతరం మీడియాతో గురువారం తిరుమల గిరిలో భారాస ధర్నా శిబిరంపై కాం గ్రెస్ నేతలు (congress leaders) దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శిబిరాన్ని పోలీసులే మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు చారాణా కూడా రుణమాఫీ కూడా చేయలేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి (ggp)ఫిర్యాదు చేశాం.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. భవిష్యత్లో చర్యకు ప్రతిచర్య ఉంటుందని కేటీఆర్ అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎ ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే చలో ఢిల్లీ కాదు చలో ప్లలె చేపట్టాలని సవాల్ విసిరారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా అని కేటీఆర్ ప్రశ్నిం చారు. ఒకటి కాదు రెండుకా దుఎనిమిది నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడ తారా రిమోట్ కంట్రోల్ పాలన తో రైతులను బలి చేస్తారా అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారు.. గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు.. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని కేటీఆర్ విమర్శించారు.
అన్నదాతలను ఆగంచేసి దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రైతుల తండ్లాట తీర్చేదెవరు రుణమాఫీ పూర్తి చేసెదెవరు అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప.. అన్నం పెట్టే రైతుల (farmer)తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..అని ప్రశ్నించారు. రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా.. 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. గుండుసున్నా. ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ (high commend)ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం అని కేటీఆర్ హెచ్చరించారు. కెటిఆర్ (ktr)వెంట ఎమ్మెల్యేలు జగదీవ్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ తదితరులు ఉన్నారు. ఇదిలావుంటే తుంగతుర్తి రైతులపై, సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై డీజీపీకి బీఆర్ఎ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్ట్లపై దాడి జరిగిన విషయం విదితమే. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు కూడా డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. బాధిత జర్నలిస్టులు శుక్రవారం డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు.