Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kumbham Krishna Reddy : కమనీయంగా శ్రీ రాధా రుక్మిణి వేణుగోపాలస్వామి కళ్యాణం

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి

పల్లకి సేవలో పాల్గొన్న పట్టణ మాజీ సర్పంచ్ కోట నరసింహ దంపతులు

వేడుకలో పాల్గొన్న దేవాలయాల కమిటీల చైర్మన్లు కోట రఘునందన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి వీరమల్ల నాగరాజు
పట్టు వస్త్రాలు సమర్పించిన దంపతులు నక్క భువనేశ్వర్ యాదమ్మ పున్న కోటేశ్వర్ పద్మావతి
అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణం

Kumbham Krishna Reddy :   ప్రజా దీవెన  నాంపల్లి  ఫిబ్రవరి 11 : నాంపల్లి పట్టణ కేంద్రంలోనున్న శ్రీ రాధా రుక్మిణి వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో స్వామివారికి పట్టణ కేంద్రంలోని మహిళలు నివాళిలతో తలంబ్రాలు కొబ్బరికాయలతో మహిళలు భక్తులు ప్రజలు వృద్ధులు వందలాదిగా కళ్యాణోత్సవం వీక్షించుటకు హాజరయ్యారు పాంచ రాత్రి ఆగమ శాస్త్రాను సారంగా వైభవంగా పురోహితులు చిరువెల్లి రాఘవ శర్మ బృందంతో చక్కగా ముచ్చటగా దంపతుల కళ్యాణం జరిగిన తీరును భక్తులకు వివరించారు ఈ వేడుకలో పల్లకి సేవ ఎదురుకోలు ఘనంగా నిర్వహించారు శ్రీ వేణుగోపాల స్వామి వారి కట్ల కానుకలను బేరం కుదరకపోవడంతో రుక్మిణి అమ్మవారి పై విపరీతమైన ప్రేమతో గోపాలుడు అలగడం జరిగింది వధువు రుక్మిణి అమ్మవారు వైపు ఉన్న బంధువులు బేర సారాలు మాట్లాడి విసిగిపోయి అమ్మవారి వద్దకుచేరుకొని గోపాలుడు వారి బంధువులు కట్నకానుకలలో ఒప్పుకోవడం లేదని అమ్మవారు వద్ద వేడుకున్నారు అమ్మవారు స్వామివారి వైపు అలవోకగా చూపులతో చూడడంతో గోపాల స్వామి అమ్మవారి వద్దకు చేరుకున్నారు అంతటితో ఇరువైపులు ఉన్న బంధువులు సంతోషంతో ఆనందపడ్డారు ఇలా ప్రతి సంవత్సరం వదుపు వైపు వరుడు వైపు కట్న కానుకలు బేరాలు డిమాండ్లు చేయడం జరుగుతుంది ఈ సన్నివేశం చాలా చూడముచ్చటగా ఉంటుంది అమ్మవారు స్వామివారి కట్న కానుకలను స్వామి ఎంత డిమాండ్ చేశాడు అనే విషయాలను ద్వారా వీడియోల ద్వారా తీసి తమ బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు దేశ విదేశాలకు పంపిస్తూ అట్టి విషయాలు పంచుకుంటూ ఆనంద పడుతుంటారు స్వామివారికి దంపతులు నక్క భువనేశ్వర్ యాదమ్మ పు న్న కోటేశ్వర్ పద్మావతి పట్టు వస్త్రాలను అందించారు .

 

శ్రీ స్వామి గారు పట్టు పీతాంబరాలను బంగారు నవరత్నాలను పొదిగిన ఆభరణములను ధరించిన నవ వరుడిగా అమ్మవారు దివ్యాలంకరణ శోభితమై ప్రత్యేక పల్లకి సేవలో శ్రీ స్వామివారిని అనుకరించగా ఆలయ పురవీధులు ఎదుర్కోలు సేవ జరిగింది అనంతరం కళ్యాణ వేదికకు శ్రీ రాధా రుక్మిణి వేణుగోపాలస్వామి సేవ చేరింది ప్రత్యేక పూజల అనంతరం ఆచార్యులు శ్రీ స్వామివారికి జంధ్యా ధారణ చేసి వేదమంత్ర పఠనంతో అమ్మవారికి అమ్మవారు శ్రీవారికి జీలకర్ర బెల్లం పెట్టి శిరస్సున అలంకరించిన తంతు కన్నుల పండుగగా జరిపించారు అనంతరం మంగళ వాయిద్యాలు నడుమ లోకనాయకుడు శ్రీ రాధా రుక్మిణి మెడలో శ్రీ వేణుగోపాలస్వామి మాంగల్య ధారణ గా వించారు ఈ కళ్యాణం ప్రజలు కనులారా ఆనందపడ్డారు ఈ కార్యక్రమంలో పట్టణ మాసి వార్డ్ మెంబర్లు గుండెబోయిన సత్తయ్య పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరే కిషన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గౌడ్ సింగిల్ విండో మాది చైర్మన్ నాంపల్లి హనుమంతు సింగిల్ విండో డైరెక్టర్ బెల్ది సత్తయ్య నాయకులు బుంగ రమేష్ నెంబర్ రాములు కోరే శివ కోరె మురళి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం శ్రీ రామకోటి గీత భక్త సంగం ప్రచార కార్యదర్శి కామీ శెట్టి శ్రీకాంత్ మార్కండేయ దేవాలయం కమిటీ మెంబర్లు సంగేపు గణేష్ రాము లక్ష్మణ్ విజయ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు