Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kurra Lakshmi : ఛాయా సోమేశ్వర ఆలయం అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళిక

పురావస్తు రాష్ట్ర డైరెక్టర్ కుర్ర లక్ష్మి

Kurra Lakshmi : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ పట్టణంలోని పానగల్లో గల సోమేశ్వరాలయ అభివృద్ధి కోసం భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేయడానికి తెలంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ కుర్ర లక్ష్మి గురువారం తన బృందంతో ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

 

ఆమె మాట్లాడుతూ రానున్న కాలంలో ఛాయా సోమేశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచుట కొరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేవస్థాన భూముల కొరకు నల్లగొండ జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. విచ్చేసిన అధికారులను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు, స్వామివారికి అభిషేకం నిర్వహించిన పిదప అధికారులను శాలువాతో సన్మానించారు.

 

 

అనంతరం గుడిలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలను నివేదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ కుర్ర లక్ష్మి తో పాటు ఆశాఖ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు, నాగలక్షి, నర్సింగ్ నాయక్, సోమశేఖార్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ బుర్రి రజిత యాదయ్య, దేవాదాయ శాఖ ఈ ఓ బాలకృష్ణ, ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్ గంట్ల అనంత రెడ్డి, రుద్రసేన సభ్యులు సోమశేఖర్ గౌడ్, వెంకట్, హరిబాబు, భరత్‌ రెడ్డి, అర్చకులు అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ లు పాల్గొన్నారు.