KVPS Gade Narasimha : ప్రజాదీవెన నల్గొండ టౌన్ :ఈనెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాదె నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం పూలే అంబేద్కర్ జన జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్ ను కెవిపిఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం పెద్ద బండ సెంటర్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాదె నరసింహ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులు వివక్షతలను ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ శక్తివంచన లేకుండా కెవిపిఎస్ పోరాటాలను నిర్వహిస్తుందని అదే క్రమంలో మహనీయులు అందించినటువంటి స్ఫూర్తిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆధిపత్య వర్గాలు, పాలకులు పెంచి పోషిస్తున్నటువంటి వివక్షతలను సేదించడానికి కులవ్యక్షత వ్యతిరేక పోరాట సంఘం ఈనెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తాలో సాయంత్రం నాలుగు గంటలకు పూలే అంబేద్కర్ జన జాతరను నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ జన జాతరకు వక్తలుగా ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, ఎంజి యూనివర్సిటీ తెలుగు అధ్యాపకురాలు అనిత, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని దీనితోపాటు ఆటపాట, మాట కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, నల్లగొండ పట్టణంలో ఉన్న ప్రజలు, అంబేద్కర్ వాదులు, ప్రజాసంఘాల నాయకులు,సామాజికవేత్తలు మేధావులు ప్రముఖులు, సామాజికవేత్తలు కళాకారులు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి బొల్లు రవీందర్ కుమార్, పట్టణ అధ్యక్షులు కోట సైదులు, తెలకలపల్లి శ్రీను, సామాజిక కార్యకర్త బొజ్జ సైదులు, మారయ్య, నోముల యాదయ్య, చింత ఎల్లయ్య, కత్తుల శ్రీను, మారయ్య తదితరులు పాల్గొన్నారు.