ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకలు: లక్ష్మీనారాయణ రెడ్డి
Lakshminarayana Reddy : ప్రజా దీవెన, కోదాడ: ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకలు అని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో గల ప్రసిద్ధిగాంచిన హజరత్ ఖజా గరీబ్ నవాజ్ ఉరుసు 75వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో వచ్చిన భక్తుల నడుమ అన్ని పార్టీలకు చెందిన నాయకులు గంధమును శిరసున ధరించి మేళతాళాలతో ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకువచ్చారు. అనంతరం దర్గా వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని ఇటువంటి ఉత్సవాలు ప్రజల్లో ఐకమత్యాన్ని చాటి చెపుతాయని అన్నారు. హజరత్ ఖజా గరీబ్ నవాజ్ దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉరుసు నిర్వాహకులు షేక్. భాజన్, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు షాబుద్దీన్, కర్రీ. సుబ్బారావు కాంగ్రెస్ యువజన నాయకులు,డేగ. శ్రీధర్, సిపిఎం నాయకులు ముత్యాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపూరి రాజు, దర్గా ముజావర్ కాజా, బచ్చు అశోక్, అలీ భాయ్, బాగ్దాద్ తదితరులు పాల్గొన్నారు.