Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Muzammil Khan:మానవత్వం చాటుకున్న ఖమ్మం కలెక్టర్, దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం

ప్రజా దీవెన, ఖమ్మం: ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటు న్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమ లమ్మ పల్లీ బండి వద్ద కారులో ఆ గారు.

కలెక్టర్ అంటే ఎవ్వరో తెలి యని కమల పల్లీలు కావాలా సార్ అని ఆడగటంతో ఓ చిరునవ్వు న వ్వారు. దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించిం ది. స్పందించిన కలెక్టర్ నీ కుటుం బానికి ప్రభుత్వం అండగా ఉంటుం దని మాటా ఇచ్చి వెళ్లారు.

తర్వాత కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య కు ఫోన్ చేసిన కలెక్టర్, జమలమ్మ కు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీవో రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్ తో మాట్లా డి కేవలం ఐదురోజుల్లోనే రూ.1లక్ష వ్యాపార రుణం చెక్కును గురువా రం అందించారు. త్వరలో కమల తో కూరగాయాల వ్యాపారం ఏర్పా టు చేసేందుకు కార్యచరణ చేశా రు.