–ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
–సిపిఐ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు
May Day Spirit : ప్రజాదీవెన నల్గొండ : చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,రైతాంగ విధానాల వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అరుణ పతాకాన్ని ఎమ్మెల్సీ సత్యం ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చికాగో నగరంలో చిందిన రక్తం ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు నాంది పలికిందని అనేక కార్మిక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు.
కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను రద్దుచేస్తూ, పనిగంటలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 12 గంటలుగా మార్చుటకు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను ముందుకు తెచ్చిందని విమర్శించారు. నేడు దేశంలో అసంఘటితరంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారికి కనీసం పని భద్రత, ఎలాంటి సౌకర్యాలు లేవని, కనీస వేతనాలకు నోచుకోక వారు దుర్భర జీవితం కొనసాగిస్తున్నారని అన్నారు.నాలుగు లేబర్ కోడ్ ల అమలు వల్ల కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతునందున కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరస్వామి, బొల్గురి నరసింహ, పట్టణ కార్యదర్శి గదేపాక రమేష్, నాయకులు కె. ఎస్ రెడ్డి, విశ్వానాధుల లెనిన్, ముండ్ల ముత్యాలు, నీతి యాదగిరి, మదర్, యూసుఫ్ దొన్నకొండ వెంకన్న, సుజాత,పద్మ తదితరులు పాల్గొన్నారు.