Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Save Government Schools : ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం

Save Government Schools : ప్రజాదీవెన నల్గొండ టౌన్ :  తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందామని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దండెంపల్లి సరోజ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 11వ వార్డు కతాల గూడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దండంపల్లి సరోజ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణను అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి జరిగే విధంగా కృషి చేయాలని కోరారు.

 

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువులతో పాటు పౌష్టికాహారం, విశాలమైన ఆటస్థలం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు సకల సౌకర్యాలు కలిగిన కతాల్ గూడ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల నమోదు పెంచడానికి తల్లిదండ్రులు, వార్డు పెద్దలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 6 నుండి జరిగే బడిబాట కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దండెంపల్లి సత్తయ్య, కంకణాల నాగిరెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, వార్డు పెద్దలు పజ్జురి పరమేష్, పజ్జురి సైదులు, దండెంపల్లి లక్ష్మణ్, కిరణ్, ఉపాధ్యాయులు చాంద్ బి, రాజశేఖర్ అంగన్వాడీ టీచర్ రమాదేవి, ఆర్పి. మమత, మారెమ్మ విద్యార్థులు పాల్గొన్నారు.