Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lions Club : లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గా రేపాల మధన్ మోహన్

** లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గా రేపాల మధన్ మోహన్

** వైస్ జిల్లా గవర్నరన్లు గా కేవీ ప్రసాద్,కోడే సతీష్ కుమార్ ఎన్నిక

Lions Club : ప్రజా దీవెన ,నల్గొండ : నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ గా రేపాల మదన్ మోహన్, వైస్ డిస్టిక్ -1 గవర్నర్ గా కేవీ ప్రసాద్, వైస్ డిస్టిక్ -2 గవర్నర్ గా కోడే సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం నల్గొండ లోని లక్ష్మి గార్డెన్ లో లయన్స్ క్లబ్ 15 వ వార్షిక జిల్లా సమావేశం జిల్లా గవర్నర్ యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబు రావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాలన్నారు.

క్లబ్ సభ్యులు సేవే పరమావధిగా భావించి సేవలందించాలన్నారు.క్లబ్ల్లో సభ్యులను చేర్పించాలని కోరారు.అనంతరం గవర్నర్ పదవులకు ఎన్నికలు జరిగాయి.ఈ కార్యక్రమం లో రాష్ట్ర లయన్స్ నాయకులు దీపక్ బట్టాచార్య, రాజీరెడ్డి, నరేందర్ రెడ్డి,తీగల మోహన్ రావు, గోలి అమరేందర్ రెడ్డి, జగిని భీమయ్య,సీ హెచ్ శివ ప్రసాద్, కేవీ ప్రసాద్, అమృతపల్లి కోటేశ్వరరావు, డాక్టర్ మోహన్ రెడ్డి, దార కృష్ణా రావు, నేతి రఘపతి, కాపా మురళి కృష్ణ, మురళీధర్ రావు, జిల్లా కార్యదర్శి శివశంకర్ సింహాద్రి, కోశాధికారి తుమ్ములూరి మురళీధర్ రెడ్డి జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా గవర్నర్లు గా ఎన్నికైన రేపాల మదన్ మోహన్, కేవీ ప్రసాద్, కోడే సతీష్ కుమార్ లను శాలిగౌరారం లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మారోజు వెంకటాచారి, కోశాధికారి వడ్లకొండ బిక్షం, ఉపాధ్యక్షులు సీఎం రెడ్డి, రాపాక రాజు, దునక వెంకన్న, మురారి శెట్టి కరుణాకర్,చిర్రబోయిన శ్రీనివాస్,బట్ట వీరబాబు తదితరులు పాల్గొన్నారు.