–ఐటీ రిటర్నులు దాఖలు చేసినవా రికీ వర్తింపుపై అనుమానాలు
–చిన్న, సన్నకారు రైతులకు మాత్ర మే రుణ మాఫీ వర్తింపు
–రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యో గులకు కూడా మినహాయింపు
–రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న మేధోమథనం
–ప్రభుత్వం వద్ద ఐటీ చెల్లింపుదా రుల జాబితాలు
Loan waiver:ప్రజా దీవెన, హైదరాబాబాద్: తెలంగాణలో (telangana) రుణమాఫీ (Loan waiver) మార్గ దర్శకాలపై మేధోమథనం ముమ్మ రంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లింపుదా రులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించేoదుకు మెజార్టీ అభిప్రాయం మెండుగా కనిపిస్తోం ది. ఆదాయపు పన్ను (Income Tax) రిటర్నులు దాఖలుచేసే రైతులు, చిరు ఉద్యోగు లకు మాత్రం రుణమాఫీ వర్తింపజే యాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తు న్నట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విధి విధానాలు ఖరారుచేసి, ముఖ్యమం త్రి కార్యాలయానికి పంపారని, సద రు నివేదికలో పలురకాల ప్రతి పాద నలను వ్యవసాయశాఖ అధికారు లు పొందుపరిచినట్లు వినికిడి. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లిస్తు న్న వారు ఎంతమంది పన్ను చెల్లిం చకపోయినా ఐటీ రిటర్నులు దాఖ లు చేస్తున్నవారెందరు అనే కోణం లో వివరాలకోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సదరు వివరాలు ఢిల్లీ నుంచివచ్చాయని, ఆ జాబితాను ప్రభుత్వం ముందు వ్యవసాయశాఖ ఉంచినట్లు, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం– కిసాన్ పథకంలో (PM- Kisan Scheme) కూడా ఐటీ చెల్లిం పుదారులను, రాజకీయ నాయకుల ను మినహాయించారు. ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి పన్ను చెల్లిం చేవారికి రుణమాఫీ వర్తింపజే యా ల్సిన అవసరంలేదని సూత్ర ప్రా యం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మానం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిట ర్నులు దాఖలుచేస్తున్న వారికి రుణ మాఫీ వర్తింపజేయాలనే ఆలోచన లో ప్రభుత్వం ఉన్నట్లు అనిపిస్తుం ది. రాజకీయ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా రుణమాఫీ పథకం నుంచి పూర్తిగా మినహాయించే అవకాశా లున్నట్లు స్పష్టమైన సమాచారం.
పీఎం కిసాన్ పథకంలో (PM- Kisan Scheme) కూడా ఎంపీ టీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మునిసిపల్ చైౖర్మన్లు తదిత ర ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. అవే మార్గదర్శకాలనురాష్ట్రం లో అమలు చేసే రుణ మాఫీ (Loan waiver) పథ కం లో వర్తింప జేయాలని రుణ మా ఫీ పథకానికి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తున్నట్లు తెలి సింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఎక్కువ జీతం తీసుకునేవారికి రుణమాఫీ వర్తింపజేసే ఉద్దేశం లేదని, అయితే తక్కువ జీతం తీసుకునే చిరు ఉద్యోగులు రైతుల జాబితాలో ఉంటే వారి వరకు రుణమాఫీ చేద్దా మనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచా రం. గత ప్రభుత్వాలు రుణమాఫీ పథకం అమలుచేసిన సందర్భంలో ఈ నిబంధన లేకపోగా నిర్ణీత గడు వు, కటాఫ్ అమౌంట్ పెట్టుకొని రుణ మాఫీ చేశారు.
దాంతో కొందరు బ డా బాబులు, భూస్వాములకు కూ డా రుణమాఫీ (Loan waiver) పథకం వర్తించింది. అలాంటివారికి ఇప్పుడు రుణమాఫీ వర్తింపజేస్తే ప్రజాధనం దుర్వినియో గం చేసినట్లే అవుతుందని, చిన్న, సన్నకారు రైతులు, అర్హులకు రుణ మాఫీ చేస్తే నిధులు సద్వినియోగం చేసినట్లు అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాగా రుణమాఫీ పథకానికి సంబం ధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో విడుదలచేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Revenue Minister Ponguleti Srinivas Reddy) తాజాగా ప్రకటించారు. దీంతో రుణమాఫీ మార్గదర్శకాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగు తోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఆగస్టు–15 డెడ్లైన్గా పెట్టుకున్న విషయం విదితమే! ఈ రెండు, మూడు రోజుల్లో మార్గద ర్శకాలతో కూడా జీవో విడుదలైతే పథకాన్ని అమలుచేయటానికి ఇం కా నెల రోజులు మాత్రమే ఉంటుం ది. రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయనే అంచనా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు సమకూర్చింది.
మరో రెండు, మూడు వారాల్లో రుణమా ఫీకి సరిపడా నిధులు సమకూర్చు కొని రుణమాఫీ ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తోంది. మరోవైపు ‘నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంట ర్’(ఎన్ ఐసీ)లో బ్యాంకర్లు, పీఏసీ ఎస్ల నుంచి వచ్చిన రైతులు, రైతుకుటుం బాలు, అప్పుల జాబితాను జల్లెడ పడుతున్నారు. రేషన్కార్డు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రైతు కుటుంబాలను (Farmer families) డిసైడ్ చేస్తున్నారు. ఆధార్ కార్డుల ఆధారంగా నంబర్ల ను సరిపోలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాల నే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం మార్గదర్శకాలపై కసరత్తు పూర్తిచేసే లోపు ఎన్ఐసీలో డేటా ప్రాసెసింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.