Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Polling closed: సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్(Lok Sabha election polling) ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లోని భూపాల పల్లి, ములుగు, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని పలు మావో యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం నాలుగు గంటలలోపు పోలింగ్(Polling centers) కేంద్రాలకు చేరుకున్న వారికి మాత్రమే అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్కు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం ఆ మేరకు సమయం ముగిసిన వెంటనే పోలింగ్ నిలిపివేసింది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను(EVMs) తరలించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు.

Lok Sabha election polling ended