**బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్…
Madhagoni Srinivas Goud: ప్రజా దీవెన /కనగల్: గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలంటే బిజెపి పార్టీ అధికారంలో వస్తేనే అభివృద్ధి చెందుతుందని శ్రీనివాస్ గౌడ్ (Madhagoni Srinivas Goud)అన్నారు మంగళవారం మండలం కేంద్రంలో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ (Madhagoni Srinivas Goud) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి సభ్యత్వాలు (BJP memberships)తీసుకోవడంలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బి ఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే మంత్రులు కమిషన్లకు కక్కుర్తి పడి రాష్ట్రాన్ని ముష్టి పట్టించడం తప్ప అభివృద్ధిలోకి తీసుకుపోవడం లేదని అన్నారు …ప్రజలకు 6 గ్యారంటీలు అని మాయమాటలతో ఒక గ్యారెంటీ అమలు చేసి ఇంతవరకు మిగతా గ్యారెంటీలు అమలు చేయలేదని కాబట్టి యువత మరియు ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు (Mandal Party Presidents)పులకరం బిక్షం ప్రధాన కార్యదర్శులు దాసరి వెంకన్న భైరగొని అశోక్ జిల్లా అధికార ప్రతినిధి పిండి పాపిరెడ్డి మండల ఉపాధ్యక్షులు పంతంగి సైదులు గౌడ్ బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి వట్టికోటి దుర్గ మహిళా మోర్చా అధ్యక్షురాలు (President of Mahila Morcha)గోశెట్టి భద్రమ్మ ప్రధాన కార్యదర్శి పాలకూరి సరిత మండల కోశాధికారి నీలకంఠం వెంకన్న సోషల్ మీడియా కన్వీనర్ పర్సనబోయిన ఈశ్వర బిక్షం మండల నాయకులు కట్ట శీను బూతు అధ్యక్షులు నాగబాబు సాయి రవి తదితరులు పాల్గొన్నారు.