Madhavi murder : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టించిన మీర్ పేట్ మాధవిని హత్య చేసింది ఒక్క రు కాదు ఆ నలుగురు అనే సంచ లన విషయాలు బయటకు వస్తుo డడంతో నివ్వెరపోతున్నారు. మాధవిని తన భర్త గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు తొలుత నుంచి అనుమానిస్తున్నా రు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు ఉన్నారని, అందులో ఓ మహిళ కూడా ఉన్నట్లు భావిస్తు న్నారు. ఇదిలా ఉండగా నిందితు డు గురుమూర్తిని 5 రోజులు కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు హత్య కు సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల తో కలసి ఓ ప్లాన్ ప్రకారం గురు మూర్తి ఆమెను హత్య చేశారని పో లీసుల దర్యాప్తులో తేలినట్టు తెలు స్తోంది.
దీంతో ఈ హత్యకు సహక రించిన చెల్లెలు సుజాతను A2 గా, తల్లి సుబ్బలక్ష్మిని A3 గా, తమ్ము డు కిరణ్ A4 గా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చేర్చినట్టు సమా చారం. మృతురాలి భర్త గురు మూర్తి ఈ హత్యలో A1గా ఉన్న విషయం తెలిసిందే. విచారణలో పలు కీలక విషయాలను పోలీసు లు రాబట్టినట్టు సమాచారం. ప్రధాన నిందితుడిపై హత్య కు సంబంధించి సెక్షన్లు నమోదు చేయగా మిగిలిన ముగ్గురిపై బీఎన్ఎస్లోని 85 సెక్షన్ గృహ హింస ప్రయోగించారు. ఈ ము గ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.