మద్నూర్ -గోజెగావ్ రాకపోకలు బంద్
ప్రజా దీవెన/ హైదరాబాద్: ఎగువనున్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లేండి వాగు పొంగిపొర్లడంతో గోజిగావ్ లో లెవెల్ బిర్జు పైనుండి వరద ప్రవాహం ఉదృతంగా సాగుతోంది. దీంతో మద్నూర్ -గోజెగావ్ రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు అధికారులు. లేండి వాగు బ్యాక్ వాటర్ తో టాక్లి వద్ద ఉన్న లో తాత్కాలిక వంతెన మునిగిపోవడం లింబూర్- సిర్పూర్ రాకపోకలు కూడా బందయ్యాయి.
యాదాద్రి భువనగిరి : తుఫాను కారణంగా లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు లు పొంగి పొర్లుతున్నాయి. యాదద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామం వద్ద మూసి నది వరద నీరు బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తుండడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.