Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

mahakumbhmela : మహా కుంభమేళాకెళ్లిన తెలంగాణ బస్సుకు ప్రమాదం

మహా కుంభమేళాకెళ్లిన తెలంగాణ బస్సుకు ప్రమాదం

mahakumbhmela:  ప్రజా దీవెన,హైదరాబాద్: ఉత్తరప్ర దేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమా దావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధ మైం ది. అందులో ఒకరు సజీవద హనమయ్యారు. మిగతా వారిని స్వస్థ లాల కు చేర్చేందుకు సహాయ క చర్యలు కొనసాగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని మధుర- బృందా వన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం బృందా వన్‌లోని టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర భ యాందోళనకు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రయాణి కులకు గాయాలయ్యాయి.

ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్‌తో మంటలను అదుపు చేసినా, అప్పటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ జిల్లాకు చెందిన భక్తులతో మహాకుంభ స్నానం చేసి బస్సు తిరిగి వస్తున్నట్లు సమా చారం. యాత్రికులను బైంసా రప్పిం చేందుకు చర్యలు కొన సాగుతు న్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చొరవ చూపారు.

అక్కడి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. యాత్రికులను క్షేమంగా తర లించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందిం చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బృందావన్ అధికారులు. ప్రత్యేక వాహనాల ద్వారా యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.