Mahatma Gandhi University: ప్రజా దీవెన, కోదాడ:మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) నల్గొండ లో బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో (Kabaddi competitions) వివిధ కళాశాలల నుండి వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు. కె.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆకుల నవీన్ కబడ్డీ జట్ల (Naveen Kabaddi Teams) ఎంపికలో విజేతగా నిలిచారు.ఈ నెల 30 వ తేదీ నుండి నవంబర్ నాలుగవ తేదీ వరకు S.R.M యూనివర్సిటీ చెన్నైలో జరిగే సౌత్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో కళాశాల తరుపున నవీన్ పాల్గొంటారు.
ఈ సందర్బంగా శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. చందా అప్పారావు (Principal Dr. chanda apparao) నవీన్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ. భవిష్యత్తులో కళాశాల తరుపున అనేక విజయాలు సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, సహాయా చార్యులు సైదిరెడ్డి, జి.సైదులు, కబడ్డీ శిక్షణ నిపుణులు నామ నరసింహారావు తదితర భోధన,బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు నవీన్ కు (naveen) అభినందనలు తెలియజేశారు.