Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University : ముగిసిన గణిత శాఖ శిక్షణ కార్యక్రమం

Mahatma Gandhi University : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ యూనివర్సిటీ, సైన్స్ కళాశాల లోని గణిత విభాగం మరియు ఎం టి టి ఎస్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమానికి నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ ఆర్థిక సహకారం అందించింది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని రాష్ట్రాల నుండి డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చాలా వినూతమైనది మా పై చదువులకు ఇది ఎంతో ఉపకరిస్తుందని వాళ్ళ మాటల్లో చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి గారు గారు హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి గణితంతో అవినాభావన సంబంధం ఉన్నదని ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క విద్యార్థి సమాజానికి గణితం యొక్క ప్రాముఖ్యతను వివరించాలని మరియు గణితం పట్ల మక్కువను పెంచాలని విద్యార్థులకు సూచించారు.

గణిత విభాగం ఈ మధ్యలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి శిక్షకులుగా ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి శివనాడ యూనివర్సిటీ ఢిల్లీ, ప్రొఫెసర్ సుకుమార్ ఐఐటి హైదరాబాద్, ప్రొఫెసర్ శివాజీ గణేష్ ఐఐటి ముంబాయి మరియు మెంటరుగా ఆర్ అమృత గారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇన్సియేషన్ టు మ్యాథమెటిక్స్ అనే కార్యక్రమాన్ని మీ సంబంధిత కళాశాలలో పరిచయం చేసి భవిష్యత్తులో ఎం టి టి ఎస్ అనేక కార్యక్రమాలకి హాజరయ్యేటట్టు చూడాలని కోరారు మరియు భవిష్యత్తులో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆహ్వానిస్తే ఉపాధ్యాయులకు అధ్యాపకులకు విద్యార్థులకు ఉపయోగపడేటట్టు అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణకు . గణిత విభాగ అధిపతి డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణ విధానం చూసి ఈ శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన కోఆర్డినేటర్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు. అన్న ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమానికి గణిత శాఖ బిఓఎస్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి కోఆర్డినేటర్ గా మరియు డాక్టర్ సముద్రాల ఉపేందర్ స్థానిక కోఆర్డినేటర్ గా వ్యవహరించి ఈ శిక్షణ కార్యక్రమానికి సహకరించిన ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ఫీసర్ మరియు రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ యూనివర్సిటీ కేటాయించిన ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తదనంతరం ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రశంస పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో గణిత విభాగ అధ్యాపకులు డాక్టర్. డి. ఐమావతి, డాక్టర్. ఎ. శ్రీనివాస్, డాక్టర్.ఎన్. కిరణ్ కుమార్ మరియు డాక్టర్. రామచంద్రు పాల్గొన్నారు.