Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా మహాత్మా గాంధీ యూ నివర్సిటీలో మంగళవారం బిఆ ర్ఎస్ పార్టీ నిర్వహించే 25 సంవ త్సరాల రజతోత్సవ సభను విజ యవంతం చేయాలని ఎంజియు బిఆర్ఎస్వీ నాయకులు పాక రవి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సన్నాక సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ హాజర య్యా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంటే తెలంగాణ గుండెచప్పుడైన గులాబీ జెండా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రారంభించిన పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ ,ఇంటి పార్టీగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని దేశంలో ఏ పార్టీ లేని విధంగా అనేక సభలు నిర్వహించి ఔరా అనిపించుకున్న ఘనత కేసిఆర్ గారికే దక్కిందని కొనియాడారు.
కానీ నేడు జరగ బోయే రజతోత్సవ సభ మాత్రం తెలంగాణ ప్రజల దశ దిశా మార్చే విధంగా నభూతో న భవిష్యత్ అనే తలపెట్టిన సభను సక్సెస్ చేసేందు కు తరలిరావాలి కోరారు. యావత్ భారతదేశం సైతం వరంగల్ వైపు చూసే విధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 16 నెలల పరిపాలనలో ప్రజ లను నిరుద్యోగులను యువతను కార్మిక, కర్షక ,విద్యార్థులను అన్ని రంగాల్లో మోసం చేస్తూ ఇచ్చిన హా మీలను నెరవేర్చకుండా మాటలకే పరిమితమై మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని దానికి చరమగీతమే రేపు జరగబోయే సభకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛం దంగా పాల్గొని విద్యార్థులు యువ త సైతం తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అనే చందంలో తరలివచ్చి వారి యొక్క ఆవేదన ను ఈ యొక్క సభ ద్వారా తెలిపా రు .ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చి న మాట ప్రకారం హామీలు నెరవే ర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం జి యు బి ఆర్ ఎస్ వి నాయకులు మైనం యుగేందర్, పాక రవి ,మాచర్ల సుధీర్, జాన్ ప్రేమ్ సాగర్, విజయ్ కుమార్, అరుణ్ ,మహేష్ ,చైతన్య, ఉదయ్ శంకర్ ,రాజు ,లింగస్వామి, క్రాంతి ,ఏడుకొండలు, ఆంజనేయులు ,శ్రీకాంత్ ,రమేష్ ,సైదులు తదితరులు పాల్గొన్నారు.