–యజమానులకు నోటీస్
July 9 nationwide strike : ప్రజాదీవెన నల్గొండ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు.మంగళవారం ఆ యూనియన్ ఆధ్వర్యంలో పవర్లూమ్ వీవర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపోలు చంద్రశేఖర్ కు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాయడానికి దూకుడు పెంచిందని అన్నారు.
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటి రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా తీసుకువచ్చిందని దీని ద్వారా కార్మికులు కట్టు బానిసలుగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంఘం పెట్టుకునే హక్కు, యజమానులతో భేరసారాలాడే హక్కు, పనిగంటలు, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, తదితర హక్కులన్నీ హరింపబడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్యుడు జీవించలేని స్థితికి తీసుకు వచ్చిందని అన్నారు. ప్రజలు పోరాటాల వైపు రాకుండా మతం పేరుతో ప్రజలను చీల్చి తన దోపిడిని కొనసాగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పవర్లూమ్ కార్మికులు, జూలై 9న పనిబంద్ చేసి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పద్మనగర్ అధ్యక్షులు గంజి నాగరాజు, ఐ డి ఏ ఆర్జలవాయి అధ్యక్షుడు పెండెం బుచ్చి రాములు, కార్యదర్శులు సూరపల్లి భద్రయ్య, దేవులపల్లి గిరిబాబు, మహిళా విభాగం కార్యదర్శి మిర్యాల శ్రీవాణి, గంజి చంద్రయ్య, కర్నాటి శ్రీరంగం, తదితరులు పాల్గొన్నారు.