–సీఐటీయూ
May 20 Nationwide Strike :ప్రజాదీవెన నల్గొండ :కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోల్డ్ రద్దు చేయాలని కోరుతూ మే 20 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ఐసిడిఎస్ డిడబ్ల్యూఓ కృష్ణవేణి, సిడిపిఓ కార్యాలయంలో సూపర్వైజర్ కు పవర్లూమ్ వీవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చెరుపల్లి శ్రీనివాస్ కు, టీజీబీసీఎల్ గోదాం మేనేజర్ కు ఎఫ్సిఐ గోదాం అసిస్టెంట్ మేనేజర్ కు, మున్సిపల్ కమిషనర్ లకు సమ్మె నోటీసులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు తర్వాత అనేక పోరాటాలు నిర్వహించి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్పులు తీసుకొస్తున్నారని ఆరోపించారు.
ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక వ్యతిరేక లేబర్ కోళ్లను రద్దు చేయాలని కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని పవర్లూమ్ హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా కనీస పెన్షన్ 10000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు స్వతంత్ర సంఘాలు ఐక్య కార్యాచరణగా మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అవుట రవీందర్, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, గంజి నాగరాజు, పల్లె నగేష్, మున్సిపల్, పవర్ లూమ్, అంగన్వాడి, బేవరేజెస్ అమాలి, ఎఫ్ సి ఐ అమాలి సంఘాల నాయకులు పి. సరిత, స్వప్న, పెండెం రాములు, పసునూరి యోగానందం, తొట్ల లింగయ్య, క్యాస రమేష్, సుంకర బోయిన వెంకన్న, నకరికంటి సత్తయ్య, మిర్యాల శ్రీవాణి, పెండెంబుచ్చి రాములు, పెరిక కృష్ణ ,పేర్ల సంజీవ, పందుల లింగయ్య, జీడిమెట్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.