Nationwide Strike : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని సిఐటి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం నల్లగొండ నియోజకవర్గం విస్తృ త సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ప్రమాదకరంగా ఉన్న కార్మిక వ్యతిరే క నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు ఉపసంహరించు కోవా లని కేంద్రా ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మూడోసారి అధి కారంలోకి వచ్చిన బిజెపి నాయ కత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మ తోన్మాద చర్యలో మరింత దూకుడు గా అమలు చేస్తుంది అని ఆయన అన్నారు. కార్మిక వర్గ సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరా లలో సాధించుకున్న 29 కార్మిక చ ట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చింది అని ఆయన అన్నారు. వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్స్ ను అమలు ఐదు సంవత్సరాలు ఆలస్యమైనా ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే విదంగా చేస్తుంది అని అన్నారు.
2025-26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుగుణంగా కేటాయింపులు చేసింది అని ఆయన అన్నారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై భారాలను మోపింది అని ఆయన అన్నారు. కార్పొరేట్ గుత్తా సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిరుద్యోగం,అధిక ధరలు, ఆకలి, అవమానాలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోరు అని ఆయన మండిపడ్డారు. హమాలి, రవాణ రంగా కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు కార్మికులకు ఉపయోగపడే విధంగా మోటార్ వాహనాల చట్టం 2019కి సవరించాలని ఆయన అన్నారు. ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ రహదారులపై డ్రైవర్లకు అన్ని సౌకర్యాలతో రోడ్డు పక్కన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు పెట్రోల్ డీజిల్ ధరలు మరియు టోల్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాం డ్ చేశారు అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కార కోసం దేశవ్యా ప్త సమ్మె జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నూత నంగా సిఐటియు నల్గొండ పట్టణ కన్వీనర్ గా అవుట రవీందర్, నల్గొండ మండల కన్వీన ర్ గా పోలే సత్యనారాయ ణ ,తిప్ప ర్తి మండల కన్వీనర్ గా భీమ గాని గణేష్ తిరిగి ఎన్నికయ్యారు. సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం అధ్యక్ష తన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు కే విజయలక్ష్మి , అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, పల్లె నగేష్, మంత్రాల మంగమ్మ , కత్తుల యాదయ్య, జేరిపోతుల సైదులు, వెంకట్ రెడ్డి, సాగర్ల మల్లయ్య, ఎర్ర సౌజన్య, పి సరిత, మిరియాల శ్రీవాణి, పెరిక కృష్ణ, పేర్ల సంజీవ,పందుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.