Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nationwide Strike : జులై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

–ప్రజా నాట్యమండలి జిల్లా అధ్య క్షుడు నాంపల్లి చంద్రమౌళి
Nationwide Strike : ప్రజా దీవెన, నాంపల్లి: నల్లగొండ జిల్లానాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కి తెలంగాణ ఆశా వర్కర్స్ యూ నియన్ (సిఐటియు) నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను నోటీ సును అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా ప్రజానాట్యమడలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్ర మౌళి మాట్లాడుతూ పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి అదేవిధం గా కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిం చాలని పెట్టుబడిదారుల ప్రయోజ నాల కోసం కార్మిక వర్గాన్ని బలి చ్చేందుకు నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.

 

2025 జులై 9న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక ఉద్యోగ వర్గం జయప్రదం చేయా లని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్ అసోసియేషన్లు ఐ ఎన్ టి సి ఏ ఎన్ టి సి హెచ్ ఎం ఎస్ సిఐటియు టి యు సి ఐ ఐ ఎఫ్ టి యు బి ఆర్ టి యు టి సి ఐ ఎన్ పిలుపునిచ్చాయి . అన్ని రంగల కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలి అని ఈ సమ్మెకు ప్రజలు ప్రజాతంత్ర వాదులు బాసటగా నిలబడి సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం కార్య క్రమంలో ఆశ వర్క్స్ యునియన్ మండల అధ్యక్షురాలు దేపవత్ కవిత, మండల నాయకురాల్లు లలిత, సునిత, కవిత, అనిత, విజయలక్ష్మి, శంకరమ్మ, నిలిమ, పద్మ,సైదమ్మ,చేన్నమ్మ,
తదితరులు పాల్గొన్నారు.