Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mall Market Committee: రైతులకు గిట్టుబాటు ధర కల్పించుటకు కృషి చేస్తా

మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి

Mall Market Committee: ప్రజా దీవెన. మునుగోడు అక్టోబర్ 10 మాల్ మార్కెట్ కమిటీ (Mall Market Committee) పరిధిలోని నాంపల్లి మర్రిగూడ చింతపల్లి గ్రామాలలోని రైతులకు (farmers) ఈ పాట ధర కల్పించే కల్పించేందుకు కృషి చేస్తానని మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి అన్నారు ఆయన బుధవారం రోజున ప్రజా దీవెన ప్రతినిధితో మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు గుర్తించిన గ్రామాలలో సిసిఎస్ కేంద్రాలను ప్రారంభిస్తారని అందులో రైతులు పండించిన పంటలను నేరుగా అమ్మకం జరుపుకోవాలని అన్నారు పంటను దళారుల వద్దకు పోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు తనను మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందుకు నాకు సహకరించిన ప్రతి కార్యకర్తకు ప్రజలకు పేరుపేరునా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా అధ్యక్షులు కామిశెట్టి చత్రపతి యాదయ్య శ్రీకాంత్ గాదపాక రాజు పూల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.