Mallareddy land dispute: మల్లారెడ్డి భూ వివాదం రచ్చ రచ్చ రoబోలా
కుత్బు ల్లాపూర్ మండలం సుచిత్ర ప్రాంతం లోని భూమి వివాదంపై ఆదివారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ప్రభు త్వ విప్ లక్ష్మణ్కుమార్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసిం ది.
సుచిత్రలోని భూ వివాదంపై మాజీ మంత్రి మల్లారెడ్డి, విప్ లక్ష్మణ్ సవా ల్, ప్రతి సవాళ్లు
పోలీసుల సహకారంతో వివాదా స్పద భూమిపై రెవెన్యూ శాఖ సర్వే
ప్రజా దీవెన, హైదరాబాద్: కుత్బు ల్లాపూర్ మండలం సుచిత్ర ప్రాంతం లోని( land dispute) భూమి వివాదంపై ఆదివారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,(Mallareddy) ప్రభు త్వ విప్ లక్ష్మణ్కుమార్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసిం ది. ఈ భూమికి సంబంధించి శ్రీనివా స్రెడ్డి వద్ద ఉన్నవి ఫేక్ డాక్యుమెం ట్లు అని మల్లారెడ్డి ఆరోపించారు. తన వద్ద ఉన్నవి ఫోర్జరీ డాక్యు మెంట్లు అని నిరూపిస్తే తాను ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ రాజీనామా చేస్తారా అని మల్లారెడ్డి సవాల్ విసిరారు. అయితే మల్లారె డ్డికి తాము వారం రోజులు గడవు ఇస్తామని, దేశంలో ఏ సర్వేయర్ తోనైనా సర్వే చేయించుకోవాలని, తమ తప్పు ఉంటే క్షమాపణ చెప్పి వెళ్లిపోతామని లక్ష్మణ్కుమార్ ప్రతి సవాల్ చేశారు.
జీడిమెట్ల గ్రామం లోని సర్వే నంబర్ 82, 83లోని 2.29 ఎకరాల భూమి విషయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, శేరి శ్రీనివాస్రె డ్డి మధ్య శనివారం ఘర్షణ జరగ డం తెలిసిందే. దీంతో పోలీసులు మల్లారెడ్డితోపాటు ఆయన అల్లు డు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశే ఖర్రెడ్డిని, శ్రీనివాస్రెడ్డిని అదుపు లోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. కాగా, ఆదివారం మల్లారెడ్డి, శ్రీనివాస్రెడ్డితోపాటు ఏసీపీ రాములు సమక్షంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో సర్వే చేపట్టారు. హద్దులను ఏర్పాటు చేసి సర్వే రిపోర్టులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమ య్యారు. ఇదిలా ఉంటే సుచిత్రలోని భూ వివాదంపై తాను భూమి పత్రా లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని, జిల్లా కలెక్టర్ను కలుస్తానని ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పారు.
సర్వే నంబర్ 82, 83లో తాము 14 యేళ్ల క్రితం భూమి కొనుగోలు చేశామని, తమ కాం పౌండ్ వాల్ లోపల 2.20 ఎకరాల భూమి మాత్రమే తమ పేరిట ఉంద ని అన్నారు. సుధామణకు చెందిన 4.24 ఎకరాలు రోడ్డుకు ఆవల ఉండేదని, అయితే ఆయన వద్ద ఉన్నవి ఫేక్ డాక్యుమెంట్లు అని, గతంలోనే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుందని తెలిపారు. 2015లో ప్రస్తుత ప్రభుత్వ విప్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభా ష్రెడ్డి సహా తొమ్మిది మంది 3900 పైచిలుకు చదరపు గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. వాళ్లు గతంలోనే భూమి విషయమై నాలుగైదుసార్లు తన వద్దకు వచ్చారని చెప్పారు. ప్రభు త్వం స్వాధీనం చేసుకున్న భూమిని సుధామణ ఎలా విక్రయి స్తారని, ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. సర్వే అనంతరం పూర్తి వివరాలువెల్లడవుతాయన్నారు.
మల్లారెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభు త్వ విప్ లక్ష్మణ్కుమార్ స్పందిం చారు. కొంపల్లిలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయ న విలేకరులతో మాట్లాడారు. మల్లా రెడ్డి భూములపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 82/1/ఈఈలో ఉన్న భూమిని 2015లో మదన్మోహన్ అనే వ్యక్తి వద్ద 4 ఎకరాలు సుధామణ కొనుగోలు చేశారని, ఆయన వద్దనుంచి సుమారు 4 వేల గజాలను తాను, మరో 8 మంది కలిసి కొనుగోలు చేశామని చెప్పారు. సుధామణ కొనుగోలు చేసిన భూమిలో కొంత మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్డుకు పోయిందని, ఆ భూమికి ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించిందని అన్నారు. ఆ భూమిని 2021లో శేరి శ్రీనివాస్రెడ్డికి అమ్మేశామన్నారు.
తమకు 2016 నుంచి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందన్నారు. ఈ మేరకు యజమాని శ్రీనివాస్రెడ్డి పొజిషన్కు వెళితే మల్లారెడ్డి బెదిరించి, భూమిని లాక్కొన్నాడని ధ్వజమెత్తారు. తమ డాక్యుమెంట్ ఫేక్ అంటున్న మల్లారెడ్డి కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆరర్డ్ను ఎందుకు వెకేట్ చేయించుకోలేదని ప్రశ్నించారు. సర్వే కోసం నోటీసులు ఇప్పిస్తే.. తనకు అవసరం లేదంటూ సమాధానం పంపించారని తెలిపారు. ఈ వివాదాన్ని గతంలో అప్పటి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలని ఆయన సూచించగా కేటీఆర్ నాకేమైనా ఫ్రీగా చేశాడా అని మల్లారెడ్డి రివర్స్ మాట్లాడారని లక్ష్మణ్ దుయ్య పట్టా రు. మల్లారెడ్డి తన పేరును ప్రస్తావిం చినందునే తాను మాట్లాడుతున్నా నని చెప్పారు.
Mallareddy land dispute clashes