Mallayya Yadav: ప్రజా దీవెన,కోదాడ: కోదాడ పురపాలక సంఘ పరిధిలోని 30వ వార్డుకు చెందిన మెప్మా R.P. బొజ్జా ప్రమీల గోపి దంపతుల పెద్ద కుమారుడు అరుణ్ సాయి ఆకస్మికముగా మరణించటం బాధాకరమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు సోమవారం విషయం తెలుసుకొని కోదాడలోని ప్రమీల ఇంటికి వెళ్ళి అరుణ్ సాయి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అరుణ్ సాయి తల్లిదండ్రులు ప్రమీల గోపి లను పరామర్శించి దానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఆయన వెంట BRS పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ పార్టీ నాయకులు కర్ల సుందర్ బాబు, చలిగంటి వెంకట్, సుంకర అభిధర్ నాయుడు తదితరులు ఉన్నారు.