Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallesh : వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి: మల్లేష్

Mallesh : ప్రజా దీవెన,కోదాడ: వాహనదారుల తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సరైన ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి హుజూర్నగర్ ఎక్స్ రోడ్డు వద్ద అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వాహనాలు నడిపేటప్పుడు తప్పక హెల్మెట్‌ ధరించాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల ధ్రువపత్రాలను దగ్గర ఉంచుకోవాలని అన్నారువాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట తెచ్చుకోవాన్నారు.

 

వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించాలని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్‌ సమస్యతలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ ఖయ్యూం, హోంగార్డులు తిరుపతి, శ్రీనివాస్ పోలీసు సిబ్బంది, వాహన చోదకులు తదితరులు పాల్గొన్నారు