ప్రమాదానికి ఎదురెళ్లొద్దు: మల్లేష్
Mallesh : ప్రజా దీవెన’ కోదాడ: రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని కోదాడ ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ అన్నారు. సోమవారం రోడ్డు భద్రత మసొత్సావాల్లో భాగంగా కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్లు వద్ద వాహన చోదకులకుఅవగాహన కల్పించారు.నిబంధనల ఉల్లంఘనలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరంగా మారుతోందన్నారు.
గత నెల రోజులుగా రాంగ్ డ్రైవింగ్ చేస్తున్న 150పైగా వాహనదారులపై చర్యలు తీసుకున్నట్లుపేర్కొన్నారు.ముందుకెళ్లి యూటర్న్ తీసుకోవాలంటే సమయం వృథా అవుతుందనే ఆలోచన మంచిది కాదని సూచించారు. కొందరు రాంగ్ రూట్ లో వాహనాలకు ఎదురెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని , ఒక్కరికి ఆదర్శంగా ఉండాలే తప్ప రాంగ్ రూట్ ప్రయాణం చేయవద్దని సూచించారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది, వాహన చోదుకులు ఉన్నారు.