Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallu Bhatti Vikramarka: జగదీష్ రెడ్డి కోరితేనే న్యాయ విచారణ

Jagdish Reddy

–మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కోరిన మేరకే వేషం –విచారణకు హాజరు కాకపోతే న్యాయవ్యవస్థ చూసుకుంటుంది
–కక్ష సాధింపు అన్నారంటే అవగా హన రాహిత్యమే
–రెవెన్యూ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాం
— ఖమ్మం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Mallu Bhatti Vikramarka: ప్రజా దీవెన, ఖమ్మం: రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై మా ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీలో వాస్తవ పరిస్థితులను శ్వేత పత్రం ద్వారా చర్చకు పెట్టామని, సభలోని సభ్యు లంతా విద్యుత్ అంశంపై మాట్లాడా రని, గత ప్రభుత్వ హయాంలో రా ష్ట్రానికి నష్టం జరిగిందని కొందరు సభ్యులు తెలిపగా సభలో పాల్గొన్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish Reddy) లేచి విద్యుత్తు కొనుగోలు అం శంపై న్యాయవిచారణ జరపాలని పదే, పదే కోరారని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు.ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా (khamam) బోనకల్లు మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జగదీష్ రెడ్డి కోరిన వెంటనే సభా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) పారదర్శకత ఉండేం దుకు న్యాయ విచారణకు ఆదేశి స్తున్నట్టు ప్రకటించారని, ఈ విష యాలన్నీ అసెంబ్లీలో రికార్డు అయి ఉన్నాయి, ఎవరైనా వెళ్లి చూసుకోవ చ్చు అని తెలిపారు.

కక్ష సాధింపు ధోరణితో జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తున్నారని ఎవరైనా మాట్లాడితే వారిది అవగాహన రాహిత్యంగా భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం (deputy cm) తెలిపారు. న్యాయవిచారణ జరగా లని నాటి విద్యుత్ శాఖ మంత్రి కోరగా, ఆ పార్టీ నేతలే కక్ష సాధింపు ధోరణి అంటున్నారు. వారి వారికే కక్ష సాధింపులు ఉన్నాయేమో, ఎవ రికి తెలుసని డిప్యూటీ సీఎం అన్నా రు. ఇందిరా గాంధీ లాంటి మహానే తలే విచారణ కమిషన్ల ముందు హాజరయ్యారని గుర్తు చేశారు. జ్యూడిషియల్ విచారణకు రామని ఎవరైనా అంటే వారి గురించి న్యాయవ్యవస్థ చూసుకుంటుందని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అను భవం కలిగిన వారు అని తెలిపారు. విచారణకు హాజరు కాము, నేను చెప్పిందే వేదం, శాసనం అంటే వారికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేదని భావి స్తున్నట్టు తెలిపారు.

విచారణకు ఆదేశించడం వరకే ప్రభుత్వం పని ఆ తర్వాత విచారణకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు ఎలా విచారిస్తారు, ఎవరెవరిని పిలు స్తారు మాకు తెలియదని డిప్యూటీ సీఎం (deputy cm) అన్నారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు అధికారులు అందు బాటులో లేరని రాష్ట్రంలో కొన్ని చోట్ల వింటున్నామం, వీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామ సభ లు నిర్వహించాలని నిర్ణయించిన ట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికి, ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సమస్య ఎదురైనప్పుడు 1912 నెంబర్ కు ఉచితంగా ఫోన్ చేయవ చ్చు అని తెలిపారు. కాల్ సెంటర్ కు ఫిర్యా దు అందిన వెంటనే విద్యు త్ అధి కారులు స్పందించి సమ స్యను పరిష్కరిస్తారని తెలిపారు.

ఫిర్యాదులు అన్ని online లో రికా ర్డు అయి ఉంటాయని వివరిం చారు. ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు 108 అంబులెన్స్ కు ఏ విధంగా అయితే ఫోన్ చేస్తారో, విద్యుత్ సమస్య వచ్చినప్పుడు 1912 ఫోన్ చేయాలని డిప్యూటీ సీఎం (deputy cm) కోరారు.గత 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో రెవెన్యూ (revenu) సమస్య ల పరిష్కారానికి జమాబంధీ లేదు. కొద్దిమంది పెద్దలకు ప్రయోజనం చేకూర్చేందుకు ధరణి (darani)అనే పోర్టల్ ను తీసుకొచ్చారు. పార్ట్ – బి లో పెట్టినవి అపహరించేందుకు వేసు లు బాటు కల్పించారు అని డిప్యూ టీ సీఎం తెలిపారు. ధరణి సమస్య లపై నిర్ణయం తీసుకుంటామని గతంలోనే చెప్పాం, దానిపై కమిటీ కూడా వేసాం, ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అందరి అభి ప్రాయాలను ప్రజల ముందు పెడతా మని డిప్యూటీ సీఎం అన్నారు. దీని కి సంబంధించి సంపూర్ణంగా, పారద ర్శకంగా ఉండేలా, ప్రజలకు జవా బుదారీగా ఉండేలా రెవెన్యూ వ్యవ స్థను ప్రక్షాళన చేస్తామన్నారు.