Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Maoist Encounter: ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో 30 మంది మావోయిస్టుల హతం

Maoist Encounter: ప్రజా దీవెన, భద్రాచలం: ఛత్తీస్ గఢ్ (Chhattisgarh)దండకారణ్యంలోమరోసారి తుపాకుల మోత మోగింది. నా రాయణ్పుర్, దంతెవాడ జిల్లాల బార్డర్లో మావోయి స్టులు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్ కౌంటర్ (Maoist Encounter)జరిగింది. అబూబ్ మడ్ ఏరియాలో పోలీసులు చేసిన సంయుక్త ఆపరేష న్లో 30 మంది మావోయిస్టులు హతమ య్యారు. పోలీసులు భారీస్థాయిలో ఆటో మేటిక్గాన్లు, పేలుడు సామగ్రి, ఆయుధాలను (Fuels, Explosives, Weapons) స్వాధీనం చేసు కున్నారు.

ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవు తోంది. ఈ ఘటనలో భద్రతా బల గాలు సురక్షితంగా ఉన్నా యి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలే దని సమాచారం. బస్తర్ వ్యాప్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసా గిస్తున్నట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.

బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పు ల్లో పాల్గొంది. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.