BRTU May Day Celebrations :ప్రజాదీవెన నల్గొండ టౌన్ :ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్బంగా గురువారం నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి బి ఆర్ టి యు ఆధ్వర్యంలో బీట్ మార్కెట్ లోని హమాలీ సంఘం, గడియారం సెంటర్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. కార్యక్రమం లో పాల్గొని జండాను ఆవిష్కరించి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ గురై వారి బతుకులు ఆగమైతున్న దశలో ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ…
పోరాటాల ద్వారా ఎనిమిది గంటల పనిదినాలు సాధించుకున్నారని, ఇప్పటికి కూడా అవుట్ సోర్సింగ్ విధానం లో శ్రమ దోపిడీ కు గురి ఔతున్నరని, జీతాలు, పీఫ్ లు సరిగ్గా ఇవ్వక, వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందారు.కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ వ్యవస్థను మార్చి పర్మినెంట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిందని దానిని వెంటనే అమలు పర్చాలని కోరారు. కెసిఆర్ హయాంలో కార్మికులకు అనేక ప్రయోజనాలు కల్పించారని, పెన్షన్లు ఇచ్చారని తెలియచేసారు. మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం వచ్చేలా అందరు కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట్ రెడ్డి,కొండూరు సత్యనారాయణ, కనగల్ పార్టీ అధ్యక్షులు ఐతగొని యాదయ్య, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి, బొజ్జ వెంకన్న, కడారి కృష్ణయ్య, నల్లగొండ ఆటో యూనియన్ అధ్యక్షులు యాదయ్య, రాష్ట్ర నాయకులు ఆర్ ఆచారి, టౌన్ ప్రసిడెంట్ ఎన్నమళ్ళ వెంకన్న, హమాలీ సంగం నాయకులు మల్లయ్య, సైదులు, శంకర్,
ఆటో యూనియన్ నాయకులు ఈదుల్ల వెంకన్న, చోట, బాబా, మతిన్, నాకేరెకంటి రవి, కేశవులు తదితరులు పాల్గొన్నారు.