MD Imran Khan: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : ఇమ్రాన్ ఖాన్
MD Imran Khan: ప్రజా దీవెన, కోదాడ: యాదాద్రి భువనగిరి జిల్లా టిఆర్ఎస్ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడానికి కోదాడ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఎండి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు.
ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు.మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.వెంటనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.