Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MD Salim: మేనిఫెస్టో వాగ్దానాలను విస్మరించిన కాంగ్రెస్

–సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం

MD Salim: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్ గా ఉందని సిఐటియు జిల్లా ఉపా ధ్యక్షులు ఎండి సలీం అన్నారు. శుక్రవారం సిఐటియు నలగొండ పట్టణ విస్తృత సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావన గాని ప్రభుత్వ ఉద్యోగులకు (Government employees) రెండో పిఆర్సి ప్రకటన గాని చేయక పోవడం విచారకరమని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సంక్షే మం కోసం పెట్టిన అంశాలు ఈ బడ్జెట్ లో లేవని పేర్కొన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవో సవరణలు బడ్జెట్లో ప్రస్తావనలేదని అభయ స్త్వం పేరుతో వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ల ఏర్పాటు, ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు హెల్త్ కార్డుల తో సహా ప్రతి మండలంలో హమాలీ నగర్ ఏర్పాటు చేస్తామని మేని ఫెస్టోలో ప్రకటించిన వాటి గురించి ప్రస్తావనే లేదని అన్నారు వివిధ పథకాల్లో పనిచేస్తున్న అంగన్వా డి ఆశ మధ్యాహ్న భోజనం కార్మికుల బకాయి వేతనా ల చెల్లింపు కనీస వేతనాల అమలు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా లాంటి చట్టబద్ధ హక్కులు కల్పన కోసం బడ్జెట్లో కేటాయిం చలేదని ఆరోపించారు కార్మికుల సంక్షేమం కనీస వేతనాల అమలు కోసం కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావా లని పిలుపునిచ్చారు.

సిఐటియు (CITU)జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహకారం హమాలీలకు సంక్షేమ బోర్డు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తింపు కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో బడ్జెట్లో తెలుప లేదని అన్నారు. నియోజక వర్గానికి 3,500 ఇండ్లు నిర్మిస్తామని చెప్పినా అవి గ్రామానికి 20 కూడా రావని అన్నారు. అర్హులై న పేద కార్మికులందరికీ ఇంటి నిర్మాణానికి 10 లక్షలు కేటాయిం చాలని, అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో జిల్లా కమిటీ సభ్యులు కే విజ యలక్ష్మి, సలివోజు సైదాచారి, పల్లె నగేష్, సాగర్ల యాదయ్య, ఆవురేశు మారయ్య, కత్తుల యాదయ్య, గంజి నాగరా జు ,జేరిపోతుల సైదులు, బచ్చల కూరి గురువయ్య, దేవర పల్లి వెంకట్ రెడ్డి, సాగర్ల మల్లయ్య, భీమనపల్లి శంకర్, కె సముద్రమ్మ, పెరిక కృష్ణ ,కట్టా శంకరయ్య, మెరుగు యాదయ్య, దొమ్మటి సైదులు, లింగయ్య ,మండ్ర శ్రీను, దాసోజు ప్రభుచారి, తదితరు లు పాల్గొన్నారు.