Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Medical Veterinary College: సీఎం నియోజకవర్గంలో పరిహారం ఇచ్చేదాకా సర్వే వద్దన్న రైతులు

ప్రజా దీవెన, వికారాబాద్: వికా రాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులో నీ 19 నంబర్ సర్వే నంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసు కున్న మెడికల్ వెటర్నరీ కళాశాల నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. భూసేకరణ చేసి మెడిక ల్ కళాశాల నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ. 10 లక్షలు ఎకరాకు 125 గజాల ప్లాటు ఒకరికి ఉద్యోగం ఇస్తానని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే స్వచ్ఛం దంగా భూమి ఇచ్చిన రైతులకు నష్టపరిహారం సరిగ్గా ఇవ్వనందుకు గాను అధికారులు ప్రభుత్వం తర ఫున భూములు కోల్పోతున్న వా రికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడా నికి సబ్ రిజిస్టర్ కొడంగల్ ఆఫీస్ కు రావాలని పిలుపునివ్వడంతో కొందరు రైతులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లకుండా మాకు సరైన న్యా యం సరైన నష్టపరిహారం అందిన తర్వాతనే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసు కుంటామని రిజిస్ట్రేషన్ ను బహి ష్కరించారు.

భవిష్యత్ కార్యాచ రణ పై గ్రామంలోని స్థానిక రైతు వేదికలో చర్చించుకోవడానికి రైతు లు గుమ్మిగూడారు. మెడికల్ కళా శాల పనులను మొదలు పెట్టడాని కి చేస్తున్న ఏరియల్ సర్వే చేసి కడీ లు పాతుతున్న వాళ్లను కడీలు పా తడం ఆపేయాలని రైతులు కోర డం జరిగింది.