Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mekapotula narendar goud : స్థానిక సంస్థల్లో బీసీలకు 42%చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి

మేకపోతుల నరేందర్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం

Mekapotula narendar goud : ప్రజాదీవెన, నారాయణఖేడ్ : బీసీలకు 42%చట్టబద్ధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా కల్పించాలని, కామారెడ్డి డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలుచెయ్యాలని, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బీసీల కోసం పార్లమెంట్ లో గళం ఎత్తుతుంటే సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రం లో జరిగే కులగణన దేశంలో నే ఆదర్శంగా ఉంటుంది .

 

అని రాహుల్ గాంధీ చెప్పిరు,కాంగ్రెస్ అధిష్టానం నమ్మకం పెట్టుకుంటే వారి నమ్మకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు. తెలంగాణ రాష్ట్రం లో జరిగిన కులగణన లో ఉద్దేశపూర్వకంగానే, 7% ఉన్న అగ్ర కులాల జనాభా 17% అని ఎక్కువగా చూపించారు. చట్టవ్యతిరేకమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను క్రమబద్దీకరణ కోసమే మోస పూరిత లెక్కలు చూపించారు.2014లో జరిపిన సమగ్ర కుటుంబ సర్వే, ప్రకారం 57%బీసీలు ఉన్నారు అని తేలింది, శ్రీకృష్ణ కమిటీ నివేదికల ఆధారంగా బీసీలు 56%గా తెలంగాణ రాష్ట్రం లో ఉన్నారు అని చెప్పింది. బీహార్, కర్ణాటక అనేక సర్వేలు బీసీలను 60%పైగా తేల్చాయి కానీ తెలంగాణా రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మాత్రం బీసీలను 46%గా చూపించే ప్రయత్నం చేసింది. కుట్ర జరుగుతోందని బీసీ ప్రజలు ఏకదాటి పైకివచ్చి రాష్ట్ర ప్రభుత్వం పై పోరాడారు.ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిస్తే బాగుంటుంది అని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, ఓయూ జాక్ ఛైర్మెన్ పాలడుగు శ్రీనివాస్, నగిరి ప్రవీణ్ కుమార్, వంగర సిద్దార్ధ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, పేదల రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గణపతి బిక్కు మాత్రే మహరాజ్,రాష్ట్ర బీసీ మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపల్లి రజిత పటేల్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరిత ముదిరాజ్, అంబాదాస్ ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, దూదేకుల సోఫీ, మరియు నవాజ్, పి. సాయిలు, పి. పండరి గ్రామ సభ్యులు పాల్గొనడం జరిగింది.