MGU : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వ విద్యా లయం జయంతి ఉత్సవాల రెండవ రోజు డ్రగ్స్ నివారణ మరియు కెరీర్ గైడె న్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిం చా రు. ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డా మదిలేటి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నల్లగొండ డి.ఎస్.పి.కె శివరాం రెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాం త ఆచార్యులు నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసం గించారు.
డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ యువత సన్మార్గంలో న డుస్తూ త్యాగధనుల ఆశయాల సా ధనకు కృషి చేయాలని సూచించా రు. అనేక సామాజిక రుగ్మతలకు వ్యక్తిగత క్రమశిక్షణ లేని మరియు స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం అన్నారు. బాధ్యతాయుతమైన పౌరులు గా తమ స్వీయ సంరక్షణ తో పాటు దేశ సామాజిక రాజకీ య సాంస్కృతిక అంశాలలో ప్రగ తిశీల క్రియాశీలక పాత్ర పోషించా లన్నారు. యువత మత్తు పదార్థా లకు సైబర్ క్రైమ్ కు, లింగ వివక్ష లు హింసకు వ్యతిరేక కార్యక్రమా లలో చురుకుగా పాల్గొనాలని సూ చించారు.
కాకతీయ విశ్రాంత ఆచార్యులు నర్సింగరావు మాట్లాడుతూ ఉపా ధి అవకాశాల వేటలో విద్యార్థులు అధ్యయనం, గమనం వైఖరి, నైపు ణ్యాలపై దృష్టి సారించాలని కోరా రు. నిరంతర అధ్యయనం, క్రమ శిక్షణ, కృతజ్ఞత భావనలు జీవితం లో భాగంగా ముందుకు సాగాల న్నారు.
అనంతరం విద్యార్థులకు రంగోలి, క్విజ్, పెయింటింగ్, బాడీ పెయిం టింగ్ అంశాలలో పోటీలను నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఉ త్సవాల చైర్మన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డా శ్రీదేవి, ప్రిన్సిపాల్ డా కె ప్రేమ్సాగర్, సిహెచ్ సుధారాణి, అరుణప్రియ సిఓఈ డా ఉపేంద ర్రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాం తి, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డా హరీష్ కుమార్, మారం వెంకటర మణారెడ్డి, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.