Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MGU Students : కృత్రిమ మేధ పై ఎంజియూ విద్యా ర్థుల పరిశోధన పత్రాల సమర్పణ

MGU Students :  ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మ జ్యోతిబాపూలే బిసి వెల్ఫేర్ డిగ్రీ కళాశాల వర్గల్ సిద్దిపేట జిల్లా వేదికగా కృత్రిమ మేధ పై జరిగిన రెండు రోజుల జాతీయ స్థాయి సెమినార్లో ఎంజీయూ ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పించారు. ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగ విద్యార్థులు గంజి పవన్, షేక్ షరీఫ్, వేల్పుల వెంకట పవన్ కుమార్, దొడ్డి సందీప్ కృత్రిమ మేదపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిసి సెమినార్ చర్చ అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఉప కులపతి ఆచార్య కాజా అల్లా హుస్సేన్ మాట్లాడుతూ కృత్రిమ మేధాలు పరిశోధనకు మరియు వినియోగానికి మంచి అవకాశాలు ఉన్నట్లు ఇంజనీరింగ్ విద్యార్థులు వాటిపై మరింత దృష్టి సారించి మెరుగైన అవకాశాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విభాగ అధిపతి జయంతి విద్యార్థులతో ఉన్నారు.