Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister bandi Sanjay : ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ టాక్స్ మినహాయింపు ఇవ్వండి

--కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేసిన సినిమా ఇది --క్రికెట్ లో పాకిస్తాన్ గెలిస్తే ఇండి యాలో సంబురాలు చేసుకునే వాళ్లను ఏమనాలి -- సమాజంలో ఇకనైనా మార్పు రావాల్సి ఉంది -- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్

‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ టాక్స్ మినహాయింపు ఇవ్వండి

–కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేసిన సినిమా ఇది
–క్రికెట్ లో పాకిస్తాన్ గెలిస్తే ఇండి యాలో సంబురాలు చేసుకునే వాళ్లను ఏమనాలి
— సమాజంలో ఇకనైనా మార్పు రావాల్సి ఉంది
— కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్

ప్రజా దీవెన, హైదారాబాద్: ‘ది సబ ర్మతి రిపోర్ట్’ సినిమాకు రాష్ట్ర ప్రభు త్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వా లని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమా ర్ కోరారు. గోద్రా ఘటనను తప్పు డుగా చిత్రీకరించి చరిత్రను కనుమ రుగు చేసేందుకు యత్నించిన కాం గ్రెస్, ఒక సెక్షన్ మీడియా కుట్రలను ఈ సినిమా ద్వారా బట్ట బయలు చేయడం అభినందనీయమన్నా రు. ‘‘ది సబర్మతి రిపోర్ట్’’ వంటి అద్బుతమైన సినిమాను అందించి న దర్శక నిర్మాతలకు, సినీ నటీన టులకు ప్రత్యేక అభినందిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం హైద రాబాద్ లోని బంజారాహిల్స్ జీవీకే మాల్ లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను బండి సంజయ్ కుమార్ వీక్షించారు.

అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్య దర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కోశా ధికారి శాంతికుమార్, డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి జె.సంగప్ప లతో కలిసి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్య లు ఆయన మాటల్లోనే…
ది సబర్మతి రిపోర్ట్ అద్బుతమైన సినిమా. ఈ సినిమాను తీసిన దర్శక, నిర్మాత, నటీనటులకు నా హ్యాట్యాఫ్. ప్రతి ఒక్కరూ చూడా ల్సిన సినిమా ఇది. వివాదాల్లే కుండా తీసిన సినిమా. నిజం నిప్పు లాంటిది. కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రను వక్రీకరించి అర్ధం పర్ధంలేని విష యాలను జోడించి వాస్తవాలను తెరమరుగు చేసేందుకు యత్నిం చింది. గోద్రా ఘటనలో కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి మద్దతిచ్చింది. అయోధ్య నుండి వచ్చిన కరసేవకులను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ దేశంలో మత విద్వేషాలు స్రుష్టించి రాజకీయ లబ్ది పొదాలని కాంగ్రెస్ చేసిన కుట్రను ఈ సినిమా ద్వారా బహిర్గతం చేశారు.

గతం నుండి జాతీయవాదులు, బీజేపీ నాయ కులు ఇదే విషయం చెబుతూ వచ్చారు. కరసేవకుల హత్యకు చేసిన కుట్రనే గోద్రా ఘటన అని చెప్పినా కాంగ్రెస్ పార్టీ, ఒక సెక్షన్ మీడియా కావాలని ప్రజల ద్రుష్టి మళ్లించింది. కరసేవకులు అయో ధ్య నుండి వస్తున్న రైలులో సిలిం డర్ పేలిందని, గ్యాస్ స్టవ్ పేలింద ని దుష్ప్రచారం చేశారు. ఈ సిని మాతో వాస్తవాలు బయటకు వచ్చాయి. జరిగిన సంఘట నకు కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ఇది.

నేటికీ సత్యం బయటకు రాకుండా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిత్యం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ జరిగి తే…. పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ సంబురాలు చేసే వాళ్లున్నారు. ఇండి యా గెలవొద్దని కోరే వాళ్లూ ఉన్నారు. చాలాచోట్ల మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్ వంటి కాలనీలున్నాయంటే ఎవరు మారాలో అర్ధం చేసుకోవాలి. ఇప్పటికైనా సమాజం మారాలి. జరుగుతున్న వాస్తవాల ను సమాజం గుర్తించాలి.

శక్తివతమైన సమాజ నిర్మాణ కోసం ప్రతి ఒక్క రూ పాటుపడాలి.ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని కోరుతున్నా. వాస్తవాలు తెలుసుకోండి. కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందువుల ను ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తు న్నాయో అర్ధం చేసుకోండి. దయచే సి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ సిని మా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నా. అద్బుత మైన ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్ లో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కూడా వెంటనే ది సబర్మతి రిపోర్ట్ సిని మాకు ట్యాక్స్ మిన హాయింపు కోరుతున్నా.

చరిత్రను వక్రీకరించి వందల మంది చావుకు, హింసకు కారణమైన కాంగ్రెస్ కుట్రలను ఈ సినిమా ద్వారా బయటపెడితే తప్పేంటి? చరి త్రను తెరమరుగు చేయాలనుకుంటున్న ఈ తరు ణంలో వాస్తవాలు బయటకు రావా లనే ఉద్దేశంతో ఈ సినిమా తీసిన దర్శక నిర్మాత లను అభినందిస్తు న్నా. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని సిని మా ఇండస్ట్రీని కోరుతున్నా.

Minister bandi Sanjay