Minister Jagdish Reddy Digbranti on Nagaram incident నాగారం ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్బ్రాంతి
ఒక్కొక్కరికి రూ.4 లక్షల నష్టపరిహారం --తక్షణ సహాయంగా సొంతంగా 75 వేలు అందజేత -- పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం --మృతుల కుటుంబాలకు పక్కా ఇళ్లు --మృత దేహాలను సందర్శించి నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్
నాగారం ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్బ్రాంతి
–ఒక్కొక్కరికి రూ.4 లక్షల నష్టపరిహారం
–తక్షణ సహాయంగా సొంతంగా 75 వేలు అందజేత
— పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం
–మృతుల కుటుంబాలకు పక్కా ఇళ్లు
–మృత దేహాలను సందర్శించి నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్
ప్రజా దీవెన /సూర్యాపేట: స్వగ్రామం నాగారం లో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలలో పాల్గొన్న ఆయన తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ తో కలసి హుటాహుటిన సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల పార్థివ దేహాల వద్ద నివాళులు అర్పించారు. వర్షాల కారణంగా గోడ కూలి మృతి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక్కొరికి రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అంతే గాకుండా తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 25 వేలు చొప్పున ముగ్గురికి 75 వేల రూపాయలు మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా అంద జేశారు. పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం కల్పించడంతో పాటు వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.వారి మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.మంత్రి జగదీష్ రెడ్డి వెంట తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, యస్ పి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.