Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy: మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన, నల్లగొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం 

Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని జివి గూడెం వద్ద 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ని ర్మాణానికి ఈ నెల 4 న భూమి పూ జ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలి పారు. నల్గొండ రెసిడెన్షియల్ పా ఠశాలను రాష్ట్రానికే ఆదర్శంగా ఉం డేలా నిర్మించాలని ఇంజనీరింగ్ అ ధికారులు, కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు.గురువారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాల నమూనా,నిర్మాణ ప నుల పై జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సమీక్షించారు.

 

5 లక్షల 58 వేల అడుగుల విస్తీ ర్ణంలో నిర్మించనున్న ఈ పాఠశాల లో 9 వసతి గృహాలు, సిబ్బంది క్వా ర్టర్స్, 3000 మందికి ఒకేసారి భోజ నాన్ని వండేలా వంటగది, 1280 మంది ఒకేసారి భోజనం చేసే విధం గా డైనింగ్ హాల్ వంటి వాటితో ని ర్మాణాన్ని చేపట్టనున్నారు. అంతే కాక వాలీబాల్, సెటిల్, ఫుట్ బాల్ తదితర కోర్టుల నిర్మాణంతో పాటు, ఓపెన్ఎయిర్ థియేటర్, ల్యాబులు, లైబ్రరీ స్టాఫ్ రూములు, క్వార్టర్స్ ను నిర్మించనున్నారు.

ఈ విషయాలన్నింటినీ టి జి ఈ డ బ్ల్యు ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇం జనీర్ బాల ప్రసాద్ పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర మంత్రి కి జిల్లా కలెక్టర్ కు వివరించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నల్గొం డ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో, హంగులతో కూడుకొని ఉండాలని మంత్రి తెలిపారు. 4 వ తేదీన ని ర్వ హించనున్న భూమిపూజ కార్యక్ర మానికి అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేయాలన్నారు. పాఠశాల మొ త్తానికి విద్యుత్ సరఫరా చేసే విధం గా సోలార్ ప్యానళ్ళు ఏర్పాటు చే యాలని, పాఠశాల నిర్మాణానికి అ వసరమైన ఇసుక, స్టీల్, సిమెంటు అన్ని ముందే సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రా క్టర్ ను ఆయన ఆదేశించారు. భవ న నిర్మాణాలలో ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే ముందే త మ దృష్టికి తీసుకురావాలని జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠితో కోరారు. ప నులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఆపకుండా నిరంత రం పనులను కొనసాగించి సాధ్య మైనంత త్వరగా పూర్తిచేసి అప్ప గించాలని చెప్పారు. పాఠశాల పూ ర్తి నాణ్యతతో ఉండాలని ,పాఠశాల ఆవరణలో ఎక్కడ వర్షం నీరు, ఇత ర నీరు నిలువ ఉండకుండా చర్య లు తీసుకోవాలని అన్నారు. బోధ నేతర సిబ్బందికి ముందుగా వసతి సౌకర్యం కల్పించేలా ఉండాలని, ఒ క్కసారి విధ్యార్థి పాఠశాలలో అ డుగుపెట్టిన తర్వాత మళ్లీ బయ టికి వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భం గా మంత్రి ఆదేశించారు.

 

స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, టీజీ ఈ డబ్ల్యు ఐడిసి డిప్యూటీ ఇంజనీర్ శైలజ, తదితరులు ఈ. సమీక్ష సమావేశా నికి హాజరయ్యారు.