— రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రణాళిక బద్ధంగా నల్గొండ పట్టణాన్ని అభి వృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలి పారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నామని, నల్గొండ మున్సిపల్ పరి ధిలోకి వచ్చే అన్ని గ్రామాలను అభి వృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటా మని చెప్పారు.శుక్రవారం ఆయన నల్గొం డ మున్సిపల్ కార్యాలయం లో నల్గొండ మున్సిపాలిటీ పరిధి లో రానున్న మూడు నెలల్లో తాగు నీరు ,విద్యుత్తు, తదితర సమస్య లు తలెత్తకుండా ఉండేందుకుగాను తీసుకోవాల్సిన చర్యలపై అధికా రులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియా ప్రతినిధుల తో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం టౌన్ పట్టణంలో ఎలాంటి తాగినీటి సమస్య లేదని, రానున్న పది పది హేను రోజుల్లో పది పదిహేను రోజుల్లో వరి కోతలు పూర్తయితా యని, అప్పుడు నల్గొండ పట్టణా నికి సమీపంలో ఉన్న పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ ను పూర్తిగా నింపుతామని, దాని వల్ల పట్టణంలో ఎలాంటి తాగునీటి సమస్య రాదని చెప్పారు. పట్టణం లో విద్యుత్ సమస్య లేకుండా 5 ఎం విఏ ట్రాన్స్ఫార్మర్ తో పాటు, కోటి రూపాయలతో 8 ఎం వి ఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.600 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ వంటివి చేపట్టడం జరిగిందన్నారు.
తడి చెత్త, పొడి చెత్తను వేరువే రుగా సేకరించేందుకు రానున్న 15 రోజుల్లో ఇంటింటికి కొత్తగా రెండు బుట్టలను ఇచ్చేందుకు టెండర్లు పిలువనున్నామని, ప్రజలు వారి బాధ్యతగా భావించి మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తలను వేరువేరుగా చేసి ఇవ్వాలని అన్నారు. డంపింగ్ యార్డ్, ఎస్టిపీలను నూతన సాంకే తిక టెక్నాలజీతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా యంత్రాంగం ప్రజాప్రతిని ధులంద రూ మూడు నెలలు మున్సిపల్ వా ర్డులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలని ప్రత్యేకించి వార్డు అధికారులు సమస్యలను తెలుసుకుని జిల్లా యంత్రాంగం దృష్టికి తన దృష్టికి తీసుకురావాల న్నారు.
ప్రజలు పారిశుథ్యం విష యంలో సహకరించడంతోపాటు, పన్నులు సకాలంలో చెల్లించా లన్నారు. ఎస్ డి ఎఫ్ ద్వారా 125 కోట్ల రూపాయ లను మంజూరు చేయించడం జరి గిందని, వచ్చే సంవత్సరంలో అండ ర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. టిఎఫ్ఐ డిసి కింద 12 కోట్లు ఐటీ వలే మంజూరు చేయించడం జరి గిందని, జూన్ మొదటి వారంలోగా పట్టణంలోని అన్ని రహదారులపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ను పూర్తి చేస్తామని చెప్పారు.
లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టకు డబుల్ రోడ్డు నిర్మాణానికి 120 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు నిర్మించనున్నామని,ఈ రెం డు గుట్టలను కలిపేలా రోప్ వే మం జూరు చేస్తామని, వీటిని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నల్గొండ పట్టణ సమీపంలో బక్కతాయికుం ట లిఫ్ట్ ఇరిగేషన్ ఈ పనులకు మూడవ తేదీ శంకుస్థాపన చేయ నున్నామని,ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ర్పాటు వల్ల నల్గొండ పట్టణంలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని మం త్రి వెల్లడించారు. ఇందుకు సంబం ధించిన టెండర్లు కూడా పూర్తయి నట్లు ఆయన తెలిపారు.
అంతకు ముందు మంత్రి జిల్లా అధికారులతో పై అంశాలపై సమీ క్షిస్తూ పట్టణంలో చేపట్టిన తాగునీ టి ట్యాంకులతో పాటు, చండూరు, హాలియా పట్టణాలలో చేపట్టిన తా గునీటి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మే మొ దటి వారంలో తాగునీటికి ఇం కా డిమాండ్ ఉండే ఆస్కారం ఉన్నందున ఎక్కడ తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, తాగు నీటి పనులు అన్నింటిని ప్రత్యేకించి వాటర్ ట్యాంక్ పనులను అదనపు సిబ్బంది నియమించి పూర్తిచేయా లని అన్నారు.
పానగల్ రిజర్వాయర్ను పూర్తిగా నీటితో నింపాలని, ఏకేబిఆర్ నుండి రెండు మోటార్లు నడిపిస్తూ పానుగల్ కూడా వచ్చేలా చూడా లని ఇరిగేషన్ అధికారులను ఆదే శించారు. నల్గొండ పట్టణంలోని తాగునీటి పరిస్థితిని ఆయన మాజీ కౌన్సిలర్ల ద్వారా అడిగి తెలుసు కున్నారు. ఎక్కడైనా సమస్య వస్తే మొత్తం వార్డులను పర్యవేక్షించి చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
రాబోయే వేసవి చాలా ముఖ్యమైం దని ప్రతి పౌరుడికి నీళ్లు ఇచ్చే బా ధ్యత ప్రభుత్వాన్నిదని తెలిపా రు .ప్రాపర్టీ టాక్స్, రెవెన్యూ కలెక్ష న్లపై మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్యాక్స్ వి చెల్లించాలని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త లను వేరు వేరుగా మున్సిపల్ వా హనాలకు ఇచ్చి పారిశుధ్యం విష యంలో సహకరించాలన్నారు. స్వ యం సహాయక మహిళా సంఘాల ద్వారా పాఠశాల విద్యార్థుల యూ నిఫామ్స్, రెవెన్యూ కలెక్షన్ పై సమీ క్ష నిర్వహించారు.
జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి అద నపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సి పల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, ట్రా న్స్కో ఎస్ ఈ వెంక టేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంక టేశ్వర్లు, తదితరులు పాల్గొ న్నారు.
Minister komatireddyvenkatreddy media conference pic.twitter.com/2GQwJRREXR
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 28, 2025