Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy : జిల్లా సమన్వయంతో పనిచేయాలి 

--పంద్రాగస్టు లోపే రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం హర్షనీయం --రైతు భరోసా పై కూడా త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం --మిషన్ భగీరథ అవాంతరాలు తొలగించేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటించాలి --నల్లగొండ జడ్పీ చివరి సమావేశం లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధికి

సమన్వయంతో పనిచేయాలి 

–పంద్రాగస్టు లోపే రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం హర్షనీయం
–రైతు భరోసా పై కూడా త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం
–మిషన్ భగీరథ అవాంతరాలు తొలగించేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటించాలి
–నల్లగొండ జడ్పీ చివరి సమావేశం లో మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: రాజకీయాలకతీతంగా నల్గొండ జిల్లా అభి వృద్దే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( ko matireddy venkat reddy) పిలుపు నిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బండా నరేందర్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరి షత్తు సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు.

మిషన్ భగీరథ, వ్యవసా యం, విద్యుత్, విద్య తదిత అంశా లపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమా వేశం చర్చించింది. కాగా జూలై 4 తో ప్రస్తుత జిల్లా పరిషత్తు ( zilla parishad) కాలపరిమితి ముగి యనునందున శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముం దుగా సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి( banda narender reddy) అధ్యక్షత వహించి మాట్లాడుతూ గత 5 సంవత్స రాలు ఏలాంటి ఒడిదు డుకులు లేకుండా జిల్లా పరిషత్తు కార్యక్రమాలను, సమా వేశాలను సజావుగా నిర్వహిం చడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

మిషన్ భగీరథ పై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తగు నీరు వచ్చేలా చూడాలని, ఇందు కు మిషన్ ఇంజనీరింగ్ అధికారులు గ్రామా లలో తిరిగి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని, అవసర మైతే శాసనసభ్యుల ( mla ) నిధుల ద్వారా చిన్నచిన్న సమస్యలను అధిగమించాలని సూచిం చారు.

వ్యవసాయం పై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఆగస్టు15లోగా రాష్ట్రంలో సుమారు 31 వేల కోట్ల రూపాయ లను రైతుల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం (cabinet) ఆమోదించినట్లు వెల్ల డించారు. అదేవి ధంగా రైతు భరోసా పై సైతం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిం ది గతంలో ఏ ప్రభుత్వం లేదని అన్నారు.

విద్యుత్ పై జరిగిన చర్చ సందర్భంగా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటికోసం ఇదివరకే జిల్లాకు 11 కోట్ల రూపాయలు మంజూ రు చేయడం జరిగిందని, ఇటీవల మరో 7 కోట్ల రూపాయలు రాను న్నాయని, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు, ఓవల్లోడు సమస్యలను తమ దృష్టికి తీసు కువస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే అడిషనల్ బడ్జెట్ ను ప్రతిపాదించాలని విద్యుత్తు ఎస్ ఈని ఆదేశించగా, అదేవిధంగా విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసు కురావాలని సభ్యులతో కోరారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఇరి గేషన్ అంశంపై మంత్రి మాట్లాడు తూ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయడమే తమ ధ్యేయమని, జిల్లాలో ఉన్న పంచాయతీ రోడ్లన్నింటిని ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చడం జరిగిందని, అదేవిధంగా సబ్ స్టేషన్లు, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు.

పార్టీలక తీతంగా ప్రతి ఒక్కరు పని చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశా రు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లిం పు లపై అధికారులు స్పష్టత నివ్వాలని అన్నారు. జిల్లాలో రోడ్లు, భవ నాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సాగునీటి ప్రాజె క్టుల మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తంకుమార్ రెడ్డిలు ఉన్నం దున జిల్లాలో పెండింగ్ లో ఉన్న గొట్టిముక్కల, సింగరాజుపాలెం పెళ్లిపాకుల రిజ ర్వాయర్లు పిల్లాయిపల్లి, ధర్మా రెడ్డి రిజ ర్వాయర్లు, కెనాల్లాను పూర్తి చేయడానికి చొరవ చూపాలని మంత్రిని కోరారు.

ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా సమిష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ( vemula veeresham) మాట్లాడుతూ జిల్లా లో సరిపోయి నన్ని ఎరువులు, విత్తనాలు ఉన్నా యని ,అయితే ఆయా ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాలు సరైన విధంగా ముందే ప్రతిపాదనలు రూపొందించు కొని సమస్య లు లేకుండా చూసుకుంటే సరిపోతుందని తెలిపారు.

మిర్యాలగూడ శాసనస భ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ( bathula lax mareddy) మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్న దని, అంతేకాక రైతు రుణమాఫీ, రైతు భరో సాతో సహా ఇతర హామీలన్నీటిని నెరవేర్చినందుకు ముందు కెళ్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామే లు మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శాలిగౌరారం తదితర మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీ రును మెరుగుపరుచుకోవాలని సూచించారు.

పంచాయతీరాజ్ రోడ్లు కొన్ని చోట్ల కంకర తేలి ఉన్నాయని వాటిని బాగు చేయాలని, జాతీయ రహదారి నుండి ఇరుకులపాడు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని, శాలిగౌరారం చెరువు కట్టను పటిష్టం చేసే పనులు చేపట్టాలని కోరారు. దేవరకొండ శాసనసభ్యు లు బాలు నాయక్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను అధిగమిం చేందుకు ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు ఇప్పించే విధంగా మంత్రి చొరవ చూపాలని ,అలాగే విద్యుత్ లైన్ల మార్పుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి మాట్లాడుతూ లో వోల్టేజ్  సమ స్యలు విద్యుత్ సమస్యలు అన్నింటిని సరైన విధంగా అంచనా వేసి వెంటనే వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, పాఠశాలలకు సంబంధించి మన ఊరు- మనబడి లో చేపట్టి మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తిచేయాలని, ప్రతి పాఠశాలకు పారిశుధ్యం, శుభ్రప రిచేందుకు సిబ్బందిని నియమించాలని, విద్యుత్ బిల్లులు, శాని టేషన్ కు స్కూల్ గ్రాంట్ మంజూరు చేయాలని, కేజీబీవీ సమర్థవం తంగా పనిచేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న చిన్న చిన్న సమ స్యలను పరిష్కరించాలని సమా వేశం దృష్టికి తీసుకువచ్చారు. కాగా సమావే శానికి హాజరైన జడ్పి టిసి లు ఎంపీపీ లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు శాలువా, జ్ఞాపకాలతో సన్మానించారు.

భువనగిర పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయ ణరెడ్డి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాస రావు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు, తదిత రులు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.

Minister komatireddy venkatreddy