Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్, ఇకపై రిజిస్ట్రేష‌న్ లకు స్లాట్ బుకింగ్ విధానం

–ఈనెల 10 వ తేదీ నుంచి ప్ర‌యో గాత్మ‌కంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీ సుల్లో అమలు
–చ‌ట్ట‌స‌వ‌ర‌ణతో రాష్ట్రంలో డ‌బుల్ రిజిస్ట్రే ష‌న్ కు చెల్లుచీటీ
–రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవం తం గా సులువుగా, వేగవంతంగా, పార దర్శకంగా, అవినీతిరహితంగా మ రింత మెరుగైన సేవలను అందిం చేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాల యాలను ఆధునీకరిస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మా చార పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించే ప‌నిలేకుండా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజి స్ట్రే ష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబో తున్నామ‌ని ఆయన మంగ‌ళవారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు.

రాష్ట్రంలో 144 స‌బ్ రిజిస్ట్రార్ కా ర్యాల‌యాల‌కు గాను మొద‌టి ద‌శ‌ లో ప్ర‌యోగాత్మ‌కంగా 22 స‌బ్ రిజి స్ట్రార్ కార్యాల‌యాల్లో ఈనెల 10 వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధా నాన్ని అమ‌లులోకి తీసుకురాబో తున్నామ‌ని ప్ర‌క‌టించారు. హైద‌రా బాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మే డ్చ‌ల్ జిల్లా కుత్బుల్లాపూర్‌, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, స‌రూర్ న‌గ‌ర్‌, చంపాపేట్, పెద్ద‌ప‌ల్లి జిల్లా రామగుండం, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (R.O), మేడ్చల్ (R.O), మహబూబ్ నగర్(R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నామ‌ని తెలిపారు.

సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకే రోజు ఒకే సమయంలో ఎక్కువ ద స్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమ ర్పించడం వలన జరిగే జప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కా ర్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించడం జరిగిం ద‌న్నారు.

ప్రజలు నేరుగా “registration. telangana.gov.in” వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చే సుకుని ఆ రోజు నిర్ధేశించిన సమ యానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చే సుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నా రు. స్లాట్ బుక్ చేసుకోనివారికోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రి జిస్ట్రేషన్ల‌ను అనుమతిస్తార‌ని, నే రుగా కార్యాలయానికి వచ్చిన వా రికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో ద స్తావేజులు స్వీకరిస్తార‌ని తెలిపారు.

అధిక రద్దీ కార్యాలయాల్లో అద నపు సిబ్బంది…పని ఒత్తిడి ఎ క్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధా నాన్ని సులభతరం చేయడానికి మరియు 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయా లలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్ల ను నియమిస్తామ‌ని, ప్రయోగాత్మ కంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని కుత్బుల్లాపూర్ కార్యాల యం లో అదనంగా ఇద్దరు సబ్ రిజి స్ట్రా ర్లు మరియు సిబ్భందిని నియమిం చడం జరిగింద‌ని, దీనివ‌ల‌న కు త్బుల్లాపూర్ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌ యాల‌ను రీ ఆర్గ‌నైజేష‌న్ చేస్తు న్నా మ‌ని, ఇందులో భాగంగా అధిక ర‌ద్దీ, త‌క్కువ ర‌ద్దీ ఉన్న స‌బ్ రిజి స్ట్రార్ కార్యాల‌యాల ప‌రిధిని అ నుసంధానం చేసి ప‌నిభారాన్ని స‌ మానం చేయ‌డానికి చ‌ర్య‌లు తీ సుకోవ‌డం జ‌రుగుతుంద‌ని, ఈ విధానాన్ని ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట – సరూర్ నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయా ల అధికార పరిధిని విలీనం చే య‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

దస్తావేజులను స్వయంగా చేసు కోవ‌చ్చు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌ కుం డా సొంతంగా దస్తావేజులను త యారు చేసుకోవడానికి వెబ్ సైట్ లో ఒక మాడ్యూల్ ని ప్రవేశపెట్టా మ‌ని మొద‌ట‌గా సేల్ డీడ్ ద‌స్తా వేజుల కోసమే ఈ సౌక‌ర్యం ఉం టుంద‌ని ఇది కూడా ఐచ్చిక‌మేన‌ని తెలిపారు.

రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజు పైన అమ్మినవాళ్ళు, కొన్నవాళ్లు, సాక్షులు మరియు సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా/భౌతికంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పట్ట డం వలన దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీని వలన ప్రజల సమయం వృధా అవడం ద్వారా ఇబ్బందులు పడు తున్నారు. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చే యడంలో భాగంగా ఆధార్ ఇ- సంతకం ప్రవేశపెడుతున్నామ‌ని ఈనెల చివ‌రిలోగా అందుబాటు లోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

డ‌బుల్ రిజిస్ట్రేషన్ చట్ట సవ రణ ….ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మా ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరి గింద‌నే ఫిర్యాదులు ప్రజల నుండి ఎక్కువగా వస్తున్నాయ‌ని, డబుల్ రిజిస్ట్రేషన్ లను నివారించడానికి చ‌ట్టాన్ని స‌వ‌రించ‌బోతున్నామ‌ని తెలిపారు. డబుల్ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాలు ఇప్ప‌ టికే చ‌ట్టాల‌ను స‌వ‌రించుకున్నా మీ య‌ని, అదేవిధంగా తెలంగాణ‌లో కూడా చ‌ట్ట‌స‌వ‌ర‌ణ చేయ‌డానికి చ‌ ర్య‌లు తీసుకుంటున్నామని రిజి స్ట్రేషన్ చట్టంలో కొత్తగా సెక్షన్స్ 22 కి సవరణ చేస్తూ సెక్షన్ 22-బి తీ సుకురావడం జరుగుతుంద‌ని తెలి పారు.