–ఎక్స్ వేదికగా వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా దీవెన, హైదరాబాద్:
Ponnam Prabhakar: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం విడతలవారీగా రూ. 5 లక్షలు సహాయం చేస్తోందని, అలాగే నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుకను సైతం ఉచితంగా ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇల్లు నిర్మాణాన్ని 400- 600 చదరపు అడుగు లలోపే ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆర్థిక స్థోమత లేకపోతే ప్రభుత్వం మహిళా సంఘాల నుంచి రూ. లక్ష రుణం అందిస్తుందని చెప్పారు. పదేళ్ల తర్వాత ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.