— గ్రామీణ అభివృద్ధి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ప్రజా దీవెన, ములుగు:చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదే శంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజా స్వామ్య దశలోకి పరివర్తన చెందింది. మన స్వాతంత్ర సమర యోధులు, మేధావుల దూర దృష్టి ప్రభావ వంతమైన చర్యల వల్ల భారత దేశం ఒక శక్తి వంతమైన గణతం త్రంగా అవతరించింది. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ ప్రజలు భాగం పంచుకుని 76 సంవత్స రాలు పూర్తయిన సంద ర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని ప్రజాప్రభు త్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ఘనం గా జరుపుకుంటున్నాం.
తెలంగాణ ప్రజా స్వామిక స్వేఛ పొందడం కోసం ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్ (Tribal warrior Kumram Bheem), తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటిపోరాటానికి నాయక త్వం వహించిన మహనీయులు రా వి నారాయణ రెడ్డి, స్వామి రామా నంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలి చిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వేంక టేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సుర వరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమం తు, బండి యాదగిరి, షోయబు ల్లాఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దాం.ఈ సం దర్భంగా తెలంగాణ ప్రజా ప్రభు త్వం (Telangana People’s Govt)చేపడుతున్న కార్యక్రమాల ను, అలాగే ములుగు జిల్లా సమ గ్రాభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి ని మీకు వివరించడానికి సంతోషి స్తున్నాను. మహాలక్ష్మి పథకం అమలు, హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీల ను ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిం చిన 48 గంటల్లోనే అమలు ప్రారం భించి చరిత్ర సృష్టించింది. ఆడబిడ్డ లకు తొలి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుండి ఎక్కడికైనా అణాపైసా ఖర్చు లేకుం డా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించడా నికి అవకాశం కల్పించాం. జిల్లాలో ఇప్పటి వరకు 54 లక్షల 38 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించ గా, 28 కోట్ల 72 లక్షల 75 వేల పైగా రూపాయలు మహిళలకు ఆదా చేకూర్చడం జరిగింది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెం పు. రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి (the hospital) వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికి త్సల పరిమితిని 5 లక్షల రూపా యల నుంచి 10 లక్షల రూపాయ లకు పెంచింది. కొత్తగా 163 చికిత్స లను ఈ పథకంలో చేర్చింది. మొ త్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం (Free medical care) అందుతోంది. జిల్లాలో ఇప్పటి వర కు 3061 మందికి ఈ పథకం ద్వా రా వైద్య సేవలు అందించాం. ఇందుకు గాను 6 కోట్ల 31 లక్షల 93 వేల వరకు ఖర్చు చేశాం. వర్షా కాలంలో అంటువ్యాధులు ప్రబల కుండా ఇంటింటి జ్వర సర్వే నిర్వ హిస్తూ వైద్య సేవలు అందిస్తు న్నాం. ఆడబిడ్డల కన్నీళ్లు తుడ వాలన్న లక్ష్యంతో ప్రారం భించిందే మహాలక్ష్మీ పథకంలోని (Mahalakshmi scheme)మరో పథ కం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ కార్యక్ర మాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి, 27న ప్రారంభించాం. ఈ పథకం ద్వార జిల్లాలో ఇప్పటి వరకు 48 వేల 493 మంది లబ్దిదారులను గుర్తిం చి, 90 వేల 290 సిలెండర్లు సర ఫరా చేసి 2 కోట్ల 4 1 లక్షలు సబ్సిడి చెల్లించాం.అల్పాదాయ వర్గాలవారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లను పారదోలి, విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. జిల్లాలో ఇప్పటి వరకు 39 వేల 528 మంది ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు. దీనికి 7 కోట్ల 3 లక్షల 69 వేల రూపాలను సబ్సిడి చెల్లించాం.
ఇందిరమ్మ ఇళ్ళు (Indiramma houses).
పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా మన జిల్లాకు 3790 ఇళ్ళ ను మంజూరు చేయడం జరిగినది. రైతన్నలకు రూ. 2 లక్షల వరకూ రుణ మాఫీ. మా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయల వరకూ రైతుల రుణాలను మాఫీ చేశాం. రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. రైతును రాజును చేయడం మా సంకల్పం… రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని రైతుకు రుణమాఫీ చేయడంతో రైతన్నలు నేడు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి సంతోషంగా ఉంది. జిల్లాలో 23 వేల 857 మంది రైతులకు 194కోట్ల 57వేల రూపాయలు రుణమాఫీ చేసి రైతన్నలకు అప్పుల భాద నుండి విముక్తి కలిగించాం.
రైతు భరోసా:
అర్హులైన రైతు లందరికీ రైతు భరోసా (Farmer’s Assurance) పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. మా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతుంది.సన్న వడ్లకి రూ.500 బోనస్. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంటల బీమా పథకం:
రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతే కాకుండా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం “తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్” ను ఏర్పాటు చేసింది.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు:
తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగు పరచడానికి “తెలంగాణ విద్యా కమిషన్” ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడిలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం.
మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది. శ్రీనిధి ఏర్పాటు, బ్యాంకులతో (Establishment of Srinidhi, with banks) అనుసంధానం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి బ్రాండింగ్ మార్కెటింగ్ లో మెలకువలు పెంపొందించే సౌకర్యాలు కల్పిస్తున్నాం. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, పౌల్ట్రీ, డైరీ, మీసేవ తదితర వ్యాపారాల ఏర్పాటుకు మహిళలను ప్రోత్సహించడంతోపాటు కొన్ని వ్యాపారాలను గ్రౌండింగ్ చేయడం జరిగింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం.
పరిసరాలు పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరని ఆరోగ్య సమాజం రూపుదిద్దుకుంటుంది. ప్రజలు ఆరోగ్య జీవితాన్ని గడిపేందుకు ప్రతి ఇల్లు పరిశుభ్రతతో, మొక్కలతో నందనవనం కావాలి. ప్రతి కుటుంబం తు.చ. తప్పక ప్రతి శుక్రవారం డ్రై డే (dry day) పాటించి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని కోరుతున్నాను. ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో వచ్చిన భారీ వర్షాలకు చెరువులు పూర్తిస్థాయిలో నిండుకుని మత్తడి పోసాయి. జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలతో వరద గండం నుండి బయట పడడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగo సేవలను అభినందిస్తున్నాను. జిల్లాలో ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు తమ పూర్తి సహకారం అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, వివిధ సంస్థల గౌరవ చైర్మన్ లు, డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక గౌరవ ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులకు ఈ సందర్భంగా శుభాభినందనలు తెలుపుచున్నాను.జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, వారి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
వేడుకలకు విచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు ప్రత్యేక ప్రణామాలు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరం తరం నిమగ్నమవుతున్న జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ గారికి, సిబ్బందికి అభినం దనలు. నిరంతరం ప్రజల్లో అవగా హన పెంపొదిస్తూ ప్రజలను చైతన్య పరచడంలో, ప్రభుత్వ కార్యక్రమా లు ప్రజలకు వివరించి, ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడపకు చేరేలా తమవంతు సహాకారం అందిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల, బాలికలకు నా ఆశీస్సులు, తెలం గాణ ప్రజాపాలన దినోత్సవ సంద ర్భంగా మీ అందరికి మరో సారి శుభాకాంక్షలు తెలియజేస్తు న్నాను.