ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ సన్నద్ధమైంది. ఇంటింటికీ ఇంటర్నె ట్ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ఆది వారం ప్రారంభించారు. దీంతో తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందు బాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రజావిజయో త్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టింది.టీఫైబర్ ద్వారా టీవీ, మొబైల్, కంప్యూటర్ వినియోగించ వచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపా రు. ఈ సేవలను మరింత విస్తరి స్తామన్నారు. దీంతోపాటు మీసేవ మొబైల్ యాప్ను మంత్రి శ్రీధర్బా బు ప్రారంభించారు. ఈ యాప్ లో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చామ న్నారు. రైతులకు రుణ మాఫీ, బోనస్ కోసం యాప్ ప్రారం భించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభు త్వం సహకారంతో టీ ఫైబర్ సేవల ను ఆదివారం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ. 300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందిం చనున్నట్లు తెలుస్తోంది. దశల వారీ గా ఇంటర్నెట్ సేవలను రాష్ట్రం లో ని అన్ని ప్రాంతాలకు విస్తరించను న్నారు. టీ ఫైబర్ ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ మాదిరిగా పనిచేస్తుంది.
ఈ కనెక్షన్ తీసుకుంటే టీవీ తో పాటు ఫోన్, ఓటీటీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పి స్తారు. టీఫైబర్ తొలిదశంలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 గ్రామ పంచాయతీల్లో అమలు చేయనున్నారు. అనం తరం ఇతర గ్రామాలకు విస్తరిం చనున్నారు.