–టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా డైరీ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu :
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఆయా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీలై నంత తొందరలో చర్యలు చేపడతా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాస న సభ వ్యవహారాల శాఖల మంత్రి, మేడ్చల్ జిల్లా ఇంచార్జి మంత్రి
డి.శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలి స్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ రూపొందించిన 2025 మీడియా డైరీని మంగళవారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్ది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, ప్ర ధాన కార్యదర్శి దొంతుల వెంకట రామిరెడ్డిలతో కలిసి, ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వాటర్స్ లో మంత్రి ఆవి ష్కరించారు. సమగ్ర సమాచారం తో టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ రూపొం చిన డైరీ జర్నలిస్టులకే కాకుండా, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద ని శ్రీధర్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ టి మల్కయ్య, జిల్లా కమి టీ నాయకులు గోవిందు, మాణిక్య రెడ్డి , చంద్రమోహన్, రాములు, అక్బర్ భాష , శ్రీనివాస్ గౌడ్ నాగేం దర్ చారి, శ్రీధర్ రావు, అనుబంధ కమిటీ కన్వీనర్లు చంద్రమౌళి, విజ య్, దామోదర్ రెడ్డి, నియోజక వర్గ, ప్రెస్ క్లబ్ ల అధ్యక్ష, కార్యద ర్శులు వల్ల మహేందర్ రెడ్డి, వేము ల శంకర్, శేషారెడ్డి, నాయకులు బాల్ రెడ్డి, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ జర్నలిస్టుల ఇళ్ల స్థలా ల సమస్యను పరిష్కరించండి
దాదాపు 15ఏళ్ళ క్రితం ఉప్పల్, ఘట్ కేసర్ జర్నలిస్టులకు కాట సింగారం గ్రామ శివారులో కేటా యించిన ఇళ్ల స్థలాల భూమిని వెం టనే స్వాధీనం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ, యూనియన్ రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాల్ రాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి వెంకట్రాం రెడ్డి లతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ మం త్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రాన్ని అందించగా ఆయన సానుకూలం గా స్పందించారు. ఇంకా ఈ కార్య క్రమంలో మేడ్చల్ జిల్లా జర్నలిస్టు లు పాల్గొన్నారు.