Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister thummala nageswarrao : అన్ని అంశాల్లో తెలంగాణ అగ్రభాగం

--దేశంలో అన్ని రాష్ట్రాల్లో కెల్లా ప్రత్యేక స్థానం --రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

అన్ని అంశాల్లో తెలంగాణ అగ్రభాగం

–దేశంలో అన్ని రాష్ట్రాల్లో కెల్లా ప్రత్యేక స్థానం
–రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం అనేక అంశాలలో కెల్లా దేశంలోనే అగ్రభాగాన ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరి యు పర్యవేక్షణ కమిటీ సమావేశా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నల్గొండ పార్లమెoటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ సంఖ్య మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ హాయంలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనబడుతున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.

దాన్యం సేకరణలో గతంలో అస్తవ్యస్త విధానాల వల్ల 50 వేల కోట్ల రూపాయల బాకీ పడగా, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వానాకాలం ధాన్యం సేకరణలో ఎంతో పురోగతి ఉందని అన్నారు .దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచిందన్నారు. గ్రామీణ ప్రాంతా లలో సమస్యలు తీర్చేందుకు సమస్యలను జిల్లా అభివృద్ధి సమ న్వయ పర్యవేక్షణ కమిటీ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్క రించేందుకు కృషి చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఈ సంవత్సరం 40 లక్షల ఎకరాలలో సన్నధాన్యాన్ని పం డించడం జరిగిందని, ధాన్యంతో పాటు, సమగ్ర కుటుంబ సర్వే తది తర అంశాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింద న్నారు .ఎందులోనూ గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం వెనుక బడి లేదని ఆయన తెలిపారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దేశవ్యాప్తంగా 780 జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు అధికారు లు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు అభిప్రా యా న్ని తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను తీసుకుని గ్రామీ ణ ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి సమస్యల పై మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను సరైన విధంగా వినియోగించుకునేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ద్వారా సాధ్యమైనన్ని కేంద్ర నిధులను జిల్లాకు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 92 ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ వాటి ద్వారా జిల్లా ప్రజలు పొందే లబ్ది తక్కువగా ఉందని, అయితే ఈ కమిటి ద్వారా పూర్తిస్థాయిలో నిధుల వినియోగానికి కృషి చేసేం దుకు జిల్లాలోని మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల ద్వారా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి నిధులు తీసుకొస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలలో అమలు చేసి గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు.వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా ఆయిల్ పామ్ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు ఆమె తెలి పారు.

మిర్యాలగూడ,నాగార్జున సాగర్,తుంగతుర్తి,నకిరేకల్,దేవరకొండ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ,కుందూరు జైవీర్ రెడ్డి,మందుల శామ్యూల్ మాట్లాడుతూ ధాన్యం అమ్మకంలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, మిల్లర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అకాల వర్షాల వల్ల నష్ట పోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు.

ఇందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ ఆయిల్ పామ్ తోటల పెంపకం ద్వారా రైతుల సమస్య లకు పరిష్కారం దొరుకుతుందని, రైతులు పంటల మార్పిడి విధా నాన్ని పాటించాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు మనసుపెట్టి అవగాహన కల్పిస్తే ఆయిల్ పామ్ తోటలు పెంచేందుకు మంచి అవకాశం కలుగుతుందని, ఎక్కడ వీలైతే అక్కడ ఆయిల్ పామ్ తోటలు పెంచాలని ,ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందుకు బాధ్య త తీసుకోవాలని కోరారు.

దేశంలో ఎక్కువగా వరి పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే నని అన్నారు.ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే కాంట్రాక్టర్ రద్దు చేస్తామని ఆయన పతంజలి స్వచ్ఛంద సంస్థను హెచ్చరించారు.

భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లా డుతూ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ ద్వారా అధికా రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా మని తెలిపారు. దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ ఆయా విషయాల పై జరిగిన సమీక్ష సందర్భంగా మాట్లాడారు. పౌరసరఫ రాలు, ఉద్యాన, గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష జరి గింది

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ , మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ ,జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Minister thummala nageswarrao